ఏడీఆర్డీవో మదన్మోహన్ n నర్సరీ, పల్లె ప్రకృతి వనాల పరిశీలన
రుద్రంగి, మే 4: నర్సరీల నిర్వహణపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు డీఆర్డీవో మదన్మోహన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని నర్సరీ, ప్రకృతి వనం పనులను అధికారులు, నాయకులతో కలిసి మంగళవా రం ఆయన పరిశీలించి, మాట్లాడారు. నర్సరీలో మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గ్రామస్తులకు అవసరాలకు అనుగుణంగా మొక్కలు పెంచాలని సూచించారు. అవెన్యూ ప్లాంటేషన్లో భాగం గా నాటిన ప్రతి మొక్కను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పల్లెలో పచ్చదనం మరింత పెంచి ఆహ్లాదం పంచేందుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక నిర్ణయం తీసుకొని ప్రకృతి వనాల నిర్మాణం చేపడుతుందన్నారు. రుద్రంగిలోని ప్రకృతి వనం ఆహ్లాదకరంగా ఉండడంతో సర్పంచ్, అధికారులను అభినందించారు. ప్రకృతి వనంలో చిన్నారుల కోసం ఆట వస్తువులు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులతో సమావేశం నిర్వహించి ఉపాధి హామీ పనులకు సంబంధించిన రిజిస్టర్లను తప్పకుండా నమోదు చేయాలని, కూలీల సంఖ్య పెంచాలని, నిబంధనల ప్రకారం పనులు చేపట్టాలన్నారు. ఇక్కడ ఎస్బీఎం సురేశ్, ఎంపీడీవో శంకర్, ఏపీవో రాజయ్య, టీఏ ధనుంజయ్, నాయకులు తర్రె మనోహర్, కార్యదర్శి జైపాల్, ఈజీఎస్ సిబ్బంది ఉన్నారు.