మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు
రూ. 6.48 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
మంచిర్యాలటౌన్, డిసెంబర్ 19: మంచిర్యాల పట్టణాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద లక్ష్మీటాకీస్ నుంచి లక్షెట్టిపేట రోడ్డు వరకు ఉన్న బైపాస్ రోడ్డును రూ.6.48 కోట్లతో సీసీ రోడ్డుగా మార్చడం, వెడల్పు చేయడం, డివైడర్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పట్టణం గుండా వెళ్లే భారీ వాహనాలు ఈ బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లేందుకు అనుగుణంగా నాణ్య తా ప్రమాణాలతో వందేళ్ల పాటు చెక్కు చెదరకుండా రోడ్డును నిర్మిస్తున్నామని చెప్పారు. సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, ఎమ్మెల్యే తనయుడు విజిత్రావు, మాజీ చైర్పర్సన్ వసుంధర, పీఏసీఎస్ చైర్మన్ సందెల వెంకటేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి, మహిళా విభాగం అధ్యక్షురాలు గరిగంటి సరోజ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధీర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు నజీర్, నాయకులు గోగుల రవీందర్రెడ్డి, జగన్, కొండాల్రావు, బొలిశెట్టి రాయలింగు, మాదాటి హన్మంతరావు, కార్కూరి చంద్రమౌళి, గౌసొద్దీన్, జెట్టి చరణ్, మున్సిపల్ కౌన్సిలర్లు పల్లపు సాయి భార్గవి, పోరెడ్డి రాజు, మినాజ్, తదితరులున్నారు.