ఆదిలాబాద్ టౌన్, జనవరి 19 : ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రామాయి గ్రామంలో 5, యాపల్గూడలో 7, శివఘాట్లో 2 చొప్పున కల్యాణలక్ష్మి చెక్కులను బుధవారం లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి అందజేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్తో సీఎం కేసీఆర్ పేదింటి అన్నయ్య అయ్యారని వైస్ ఎంపీపీ గండ్రత్ రమేశ్ పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రహ్లాద్, సర్పంచులు పెందూర్ గంగారాం, కార్ల విఠల్, మన్నె ఇందూబాయి రతన్, టీఆర్ఎస్ నాయకులు ఆరె నరేశ్, ఉపసర్పంచ్లు నగేశ్, లక్ష్మీకిషన్ ఉన్నారు.
ఆడపడచులకు వరం..
జైనథ్, జనవరి 19 : ఏ రాష్ట్రంలో లేని కల్యాణలక్ష్మి పథకం కేవలం మన రాష్ట్రంలో అమలవుతుందని, ఇది ఆడపడచులకు వరంలాంటిదని వైస్ ఎంపీపీ విజయ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని లేకర్వాడ, నీరాల గ్రామలకు చెందిన ఆరుగురు లబ్ధిదారులకు బుధవారం కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి పథకాన్ని తమిళనాడు రాష్ట్రంలో సైతం అమలు చేయనున్నట్లు తెలిపారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఎందుకు అమలుకావడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఆడపడుచులకు పెద్దన్నగా అండగా నిలుస్తున్నారని గుర్తుచేశారు. లక్ష్మీపూర్లోనూ చెక్కులను పంపిణీ చేశారు. రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ తల్లెల చంద్రయ్య, రైతు బంధు మండల కన్వీనర్ ఎస్ లింగారెడ్డి, ఉపసర్పంచ్ గాజెంగుల స్వామి, రైతు బంధు సమితి గ్రామ కమిటీ అధ్యక్షుడు దాసరి రాములు, డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరి, కోఆప్షన్ సభ్యుడు ఎస్కే రవూఫ్, నాయకులు చంద విఠల్, ప్రభాకర్, మర్శెట్టి విఠల్, జూనియర్ అసిస్టెంట్ సునీత ఉన్నారు.