నేడు, రేపు ఉత్సవాలు
ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ సభ్యులు
లక్ష్మణచాంద, డిసెంబర్ 18 : లక్ష్మణచాంద మండలంలోని ధర్మారం గ్రామంలో కోతి దేవుని జాతరకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి రెండు రోజులపాటు నిర్వహించనుండగా, ఆలయం ముస్తాబైంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానుండగా, ఆలయ కమిటీ అ న్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. కాగా, అవాంఛనీ య సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు. 19న రాత్రి 9:30 గంటలకు రథయాత్ర, 20న జాతర, అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
కోతి జాతర చరిత్ర..
1973లో మండలంలోని ధర్మారం గ్రామానికి ఓ కోతి వచ్చి గ్రామస్తులతో కలిసి ఉండేది. పిల్లలతో సరదాగా ఉండగా, తమ కుటుంబం లో సభ్యుడిగా భావిస్తూ అందరూ ఆహారం అందించేవారని పెద్దలు చెబుతున్నారు. పంటచేలకు నీరందించేందుకు అప్పట్లో ఎడ్లతో రా టును నడిపేవారు. అయితే రైతు స్థానంలో ఆ కోతి ఉండి రాటునడిపేది. కొద్ది రోజుల తర్వా త దాని ప్రవర్తనలో మార్పువచ్చింది. గ్రామస్తులపై తిరగబడింది. విసిగిపోయిన కొందరు దండించినప్పటికీ తిరిగి గ్రామానికి వచ్చి ఇ బ్బందిపెట్టేది. దాంతో దానిని చంపి పీచరకు వెళ్లే రహదారిని ఆనుకొని ఉన్న చిన్న చెరువు కట్ట చివరణ పాతిపెట్టారని చెప్పారు. అయితే పొలం పనులకు వెళ్లే సమయంలో కోతి సమా ధి వద్దకు రాగానే ఎడ్లు అక్కడే నిలబడిపోయే వి. ముందుకు వెళ్లేందుకు నిరాకరించేవని చెప్తున్నారు. రైతులు సమాధికి మొక్కగానే ఎడ్లు ముందుకు కదిలేవి. కోతి మహత్యం తెలిసిన గ్రామస్తులు అక్కడ పూజించడం ప్రారంభించా రు. రాను రానూ భక్తుల సంఖ్య పెరుగుతూ వ చ్చింది. గ్రామ పెద్దలు ఆలయం నిర్మించారు. అప్పటి నుంచి యేటా రెండు కోతి దేవుని జాతర నిర్వహిస్తున్నట్లు పెద్దలు చెప్పారు.