జైనూర్, అక్టోబర్ 18 : ఈనెల 20న జోడెఘాట్లో నిర్వహించనున్న కుమ్రం భీం, కుమ్రం సూరు వర్ధంతి, సూరు విగ్రహావిష్కరణకు ఆదివాసులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావు పిలుపునిచ్చారు. మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి సోమవారం పోస్టర్ విడుదల చేసి మాట్లాడారు. కార్యక్రమంలో తుడుందె బ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్రం శంకర్, సీనియర్ నాయకుడు మెస్రం అంబాజీరావు, సర్పంచ్లు మడావి భీంరావు, కుమ్రం శ్యాంరావు, రాహుల్, కొలాం సంఘం జైనూర్, సిర్పూర్-(యూ), కెరమెరి మూడు మండలాల సంఘం అధ్యక్షులు సిడాం ధర్ము, ఆత్రం రాజు, నాయకులు తొడసం ధర్మారావు, గెడాం లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
సిర్పూర్-(యూ) మండలకేంద్రంలో ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కుడ్మెత విశ్వనాథ్ ఆదివాసీ హక్కుల పోరాట సమితి, సంఘం నాయకులతో కలిసి కుమ్రం భీం, కుమ్రం సూరు వర్ధంతి పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు కబీర్దాస్, ఆత్రం భీంరావు, మెస్రం భూపతి, ఆనంద్రావు, సుభాష్, భీంరావు, గంగారాం, వెంకటేశ్, అంబారావు తదితరులు ఉన్నారు.
నేడు సంత్ రామారావు మహరాజ్ వర్ధంతి
బంజారాల ఆరాధ్యదైవం సద్గురు సంత్ రామారావు మహరాజ్ ప్రథమ వర్ధంతిని మంగళవారం నిర్వహించనున్నట్లు లంబాడా ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు వసంత్రావు జాదవ్ అన్నారు. మండలకేంద్రంలో సంఘం సభ్యులతో కలిసి సోమవారం మాట్లాడారు. తండాల్లో వర్ధంతిని భక్తిశ్రద్ధ్దలతో నిర్వహించాలని, అదేవిధంగా 20న ఉదయం జిల్లాలోని అన్ని తండాల్లో భజన , భోజ్ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సంఘం మండలాధ్యక్షుడు జాదవ్ మోహ న్, సంఘం జిల్లా కార్యదర్శి దయాకర్, రాథోడ్ ధర్మారావు తదితరులు ఉన్నారు.
లింగాపూర్, అక్టోబర్ 18: సద్గురు రామారావ్ మహరాజ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని లంబాడాల ఐక్య వేదిక జిల్లా కోఆర్డినేటర్ రాథోడ్ జైపాల్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు పాల్గొన్నారు.