కోటపల్లి, అక్టోబర్ 17 : ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరంలాంటిదని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ అన్నారు. కోటపల్లి మండలం పారుపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ మండల నాయకుడు పాలపులపు చంద్రుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.1.25 లక్షలకు సంబంధించిన చెక్కును ఎమ్మెల్సీ అందజేశారు. కరోనా బారిన పడి చంద్రు దవాఖానలో చేరాడు. ఆ సమయంలో రూ.50 వేలను ఎమ్మెల్సీ ఆర్థిక సాయం చేశారు. సీఎంఆర్ఎఫ్ నుంచి మరో రూ.1.25 లక్షలు మంజూరు చేయించి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని, పార్టీకి సైనికులుగా పని చేసిన ప్రతి కార్యకర్త, నాయకుడికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పెద్దపోలు సాంబాగౌడ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బైస ప్రభాకర్, మల్లంపేట సర్పంచ్ అక్కల మధూకర్, మం డల నాయకులు గట్టాగౌడ్, కుర్మ భీమాగౌడ్, పూరెళ్ల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
కాసిపేట మండలంలో..
కాసిపేట, అక్టోబర్ 17 : మండలంలోని దేవాపూర్కు చెందిన మోరె నారాయణకు ఇటీవల అనారోగ్యంతో ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందాడు. ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోగా సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.22 వేలు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కును టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అందజేశారు. సీఎంఆర్ఎఫ్ నుంచి సాయం మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మోరె నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మడావి అనంతరావు, ఓసీసీ యూనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు తిరుపతిరెడ్డి, గడ్డం పురుషోత్తం, బింగి శ్రీనివాస్, గ్రామ అధ్యక్షుడు వడ్లూరి మల్లేశ్, రొడ్డ కిష్టయ్య, దండవేణి చందు, కొత్త శ్రావణ్, గోనె రవీందర్, కొంగ విజయ్ పాల్గొన్నారు.