ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
పట్టణంలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ
ఆదిలాబాద్ రూరల్, జూన్ 17: ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని మహాలక్ష్మీ వాడలో రూ. 45లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఆయన భూమి పూజ చేసి శిలాఫలకాన్ని గురువారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ ముఖ్యంగా పట్టణంలోని స్లమ్ కాలనీలపై ప్రత్యేక దృష్టి నిలిపి అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామన్నారు. ఇక్కడ అవసరమైన డ్రైనేజీలు, రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి ఎమ్మె ల్యే జోగు రామన్న అండగా నిలుస్తున్నారని, పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయిస్తున్నారని పేర్కొన్నారు. పట్టణంలో రోడ్ల వెడల్పు, డివైడర్ల ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు ప్రక్రియ చి వరి దశకు చేరుకుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిల ర్లు బండారి సతీశ్, పందిరి భూమన్న, ప్రకాశ్, సంద నర్సింగ్, కొండ గణేశ్, కో ఆప్షన్ సభ్యురా లు ఇజ్జగిరి మమత, దుర్గం శేఖర్ పాల్గొన్నారు.
ఇండ్లు నిర్మించి ఇస్తాం
జైనథ్, జూన్ 17: నిరుపేదలకు వారి సొంత జాగల్లోనే డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. గురువారం జైనథ్ మండల కేంద్రంలోని రైతువేదికలో 35 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. దేశంలో ఎక్క డా లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలువు తున్నాయని, కేంద్ర మంత్రులు కూడా ప్రశంసిస్తు న్నారని పేర్కొన్నారు. కాని ఇక్కడి బీజేపీ నాయకు లు రాజకీయం చేయడానికి పనిగట్టుకొని బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారె డ్డి, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, వైస్ ఎంపీపీ విజయ్కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు టి. వెంకట్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్రెడ్డి, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు ఊశ న్న, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు దేవ న్న, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
పొరుగు దేశాలకు అమ్మడంతోనే..
బేల, జూన్17: ఇక్కడ తయారైన కొవిడ్ వ్యా క్సిన్ను కేంద్ర ప్రభుత్వం పొరుగుదేశాలకు అమ్మ డం వల్లే దేశంలో కొరత ఏర్పడిందని ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు. బేల మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి చెక్కులను గురువారం పంపిణీ చేశారు. కేంద్రం తీరుతో సామన్య ప్ర జలకు ఇబ్బంది ఎదురవుతున్నదన్నారు. ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రా వుత్ మనోహర్, రైతుబందు సమితి అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, నాయకులు గంభీర్ఠాక్రే, సతీశ్పవార్, జక్కుల మధూకర్, సర్పంచ్ సంఘం అధ్యక్షుడు ఇంద్రశేఖర్, అధికారులు ఉన్నారు.