ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు
ముత్యంపేటలో గ్రామ ముఖద్వారం ప్రారంభం
దండేపల్లి, అక్టోబర్16: గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని ముత్యంపేట గ్రామం వద్ద మోటపల్కుల గురువయ్య తండ్రి పోచయ్య స్మారకార్థం నిర్మించిన గ్రామ ముఖద్వారాన్ని ప్రారంభించారు. గ్రామస్తులంతా ఐక్యంగా ఉండి అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ అనిల్, సర్పంచ్ విఠల్, ఉపసర్పంచ్ వెంకటేశ్, నాయకులు ఉన్నారు.
సాయిబాబా ఆలయంలో పూజలు ..
శ్రీరాంపూర్, అక్టోబర్ 16: శ్రీరాంపూర్ ఆర్కే 8కాలనీలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, ఆలయ కమిటీ చైర్మన్ మల్లెత్తుల రాజేంద్రపాణి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు వెంకటరమణాచారి, కౌన్సిలర్ పూదరి కుమార్, ఆలయ డైరెక్టర్లు బండి తిరుపతి, మాజీ సర్పంచ్ కమలాకర్రావు, మాజీ ఉప సర్పంచ్ సిద్దం శంకర్, ముక్త రవి, నాయకులు వెంకటేశ్, రామకృష్ణ, సురేశ్, మహేశ్ పాల్గొన్నారు.