మూడు రోజుల్లో కోరిన చోటుకు చేరవేత
మంచిర్యాల అర్బన్/కోటపల్లి, ఆగస్టు 14: కొవిడ్ నేపథ్యంలో తపాలాశాఖ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశంలో ఎక్కడికైనా రాఖీ బుక్ చేసిన మూడు రోజుల్లో చేరేలా అంతా సిద్ధం చేసింది. కొవిడ్ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తపాలాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో యువతులు, మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటి నుంచే ఆన్లైన్లో బుకింగ్…
కొవిడ్ నేపథ్యంలో ఇంట్లో ఉండడం మేలని వైద్యారోగ్య శాఖ, ఇటు తెలంగాణ ప్రభుత్వం సూచనలు చేస్తున్న సమయంలో మహిళలు, యువతులు తపాలా కార్యాలయానికి వెళ్లకుండానే ఇంట్లో ఉండి ఆన్లైన్లో రాఖీ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆన్లైన్( http://www.eshop.tsposts.in )లో వంద రూపాయలకు మనకు నచ్చిన రాఖీ ఎంపిక చేసుకోవడంతో పాటు లెటర్(టెక్ట్స్) సెలక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరికి పంపించాలి(డియర్) అని, ఫ్రం యువర్ అని ఉన్న బాక్సుల్లో పేర్లు, చిరునామా టైప్ చేయాల్సి ఉంటుంది. ఇలా బుక్ చేసిన రాఖీలు మూడు రోజుల్లో వారి సోదరులకు తపాలాశాఖ ద్వారా దేశవ్యాప్తంగా చేరుతాయి. ఇందు కోసం తపాలాశాఖ దేశ వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేసింది.
16వ తేదీ వరకు అవకాశం…
దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రానికైనా, సైనికులకు అయినా రాఖీ పంపించే అవకాశం ఉందని మం చిర్యాల తపాలాశాఖ అసిస్టెంట్ సూపరింటెండెం ట్ రామారావు, కోటపల్లి ఎస్పీఎం రాజబాపు తెలిపారు. ఈ నెల 16వ తేదీలోపు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నారు. బుక్ చేసిన మూడు రోజుల్లో రాఖీ చేరుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.