కోటపల్లి, సెప్టెంబర్ 13 : మండలంలోని కొల్లూరు, రాంపూర్, దేవులవాడ, బబ్బెరచెలుక, వెల్మపల్లి, అన్నారం గ్రామాల టీఆర్ఎస్ కమిటీలను సోమవారం ఎన్నుకున్నారు. అలాగే మహిళా, యువజన, సోషల్ మీడియా కమిటీలను ఎన్నుకున్నట్లు వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్ వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కోప్షన్ సభ్యుడు అజ్గర్, పీఏసీఎస్ చైర్మన్ పెద్దపోలు సాంబాగౌడ్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ గుర్రం రాజన్న, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు బైస ప్రబాకర్, నియోజకవర్గ కోఆర్డినేటర్ ముల్కల్ల శశిపాల్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ మారిశెట్టి విద్యాసాగర్, నాయకులు పిల్లి సమ్మయ్య, పడాల శ్రీనివాస్, గాదె శ్రీనివాస్, ఆసంపల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు.
వేమనపల్లి, సెప్టెంబర్ 13 : కల్లెంపల్లి కమిటీని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోలి వేణుమాధవ్రావు ఆదేశాల మేరకు వేమనపల్లి, సుంపుటం సర్పంచ్లు కుబిడె మ ధూకర్, కొండగొర్ల బాపు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షులుగా బూద య్య, ప్రధాన కార్యదర్శిగా శంకర్, యూత్ కమిటీ అధ్యక్షుడిగా ఆలం సుధాకర్, వ్యవసాయ కమిటీ అధ్యక్షుడిగా మడె రామయ్య, మహిళా అధ్యక్షురాలిగా ఆలం హంస ఎన్నికయ్యారు. వారికి నియామక పత్రాలు అందించారు.
భీమారం సెప్టెంబర్ 13 : భీమారం గ్రామ కమిటీని సర్పంచ్ గద్దె రాంరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వేముల ప్రణీత్గౌడ్, యూత్ అధ్యక్షుడిగా పోటు రంజీత్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ కలగూర రాజ్ కుమార్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వేముల శ్రీకాంత్ గౌడ్, మాజీ జడ్పీటీసీ జర్పుల రాజ్కుమార్ నాయక్, నాయకులు వీరగోణి రమేశ్ గౌడ్, చింతల శ్రీనివాస్, దాసరి ప్రకాశ్ పాల్గొన్నారు.