ప్రభుత్వ విప్ బాల్క సుమన్
చెన్నూర్ క్యాంపు కార్యాలయంలో చెక్కుల పంపిణీ
చెన్నూర్, నవంబర్ 11 : నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం సహాయ నిధి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్లోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం సహాయ నిధి ద్వారా నియోజకవర్గంలోని చెన్నూర్ పట్టణం, చెన్నూర్ మండలానికి చెందిన 42 మందికి రూ 11,76,500, కోటపల్లి మండలానికి చెందిన 13మందికి రూ 3,65,500, భీమారం మండలానికి చెందిన 9మందికి రూ 2,76,500, జైపూర్ మండలానికి చెందిన 23మందికి రూ 8,76,500 ఆర్థిక సహాయం మంజూరవగా, అందుకు సంబంధించిన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మందమర్రి పట్టణంలో..
మందమర్రి నవంబర్ 11: పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయం వద్ద మందమర్రి మండలం, మున్సిపాలిటీ, క్యాతన్పల్లి మున్సిపాలిటీకి చెందిన 17 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను విప్ సుమన్ అందజేశారు.