ఎదులాపురం, నవంబర్ 11: శాంతిభద్రతల పర్యవేక్షణలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి
ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. జిల్లాకు కొత్తగా వచ్చిన నలుగురు ఆర్ఎస్ఐలు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి, మొక్కను అందజేశారు. క్లిష్ట సమయంలో నిమిషాల వ్యవధిలోనే బలగాలు అందుబాటులోకి రావడానికి స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్లో సదా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. 2020 బ్యాచ్కు చెందిన ఆర్ఎస్ఐలు ఎం. శ్యామ్ కుమార్, పీ.వై. నాయుడు, జే. లవణ్ కుమార్, బీ కిశోర్ రెడ్డి గు రువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో జిల్లా ఇన్చార్జి ఎస్పీని కలిసి రిపోర్ట్ చేశారు. ఈ సమావేశంలో రిజర్వ్ సీఐ గడిగొప్పుల వేణు, స్పెషల్ బ్రాంచ్ సీఐ జే. కృష్ణమూర్తి, ఎస్ఐ సయ్యద్ అ న్వర్ ఉల్ హక్, క్యాంపు కార్యనిర్వహణాధికారి దుర్గం శ్రీనివాస్ పాల్గొన్నారు.
జిల్లా న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్,ఎస్పీ
నల్గొండ జిల్లాకు బదిలీ అయిన జిల్లా ప్రధాన న్యా యమూర్తి బీఎస్ జగ్జీవన్ కుమార్ను కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఇన్చార్జి ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర న్యాయమూర్తి చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. జిల్లా ప్రజలకు న్యాయపరంగా మంచి సేవలు అందించారని కొనియాడారు. న్యాయవ్యవస్థపై జిల్లా ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా విశేష కృషి చేశారన్నా రు. నిరుపేదలు, అభాగ్యులకు ఉచితంగా న్యాయసహాయం కల్పించడానికి గ్రామాల్లో న్యాయసేవ సదస్సులు నిర్వహించారని పేర్కొన్నారు.