బజార్హత్నూర్, డిసెంబర్ 10: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రెండు డోస్ల కొవిడ్ టీకా తీసుకోవాలని ఇన్చార్జి ఎంపీడీవో మహేందర్రెడ్డి సూచించారు. మండలంలోని జాతర్ల, చిన్నహత్నూర్, పిప్పిరి, గిర్నూర్, టెంబి, భూతాయి గ్రామాల్లో బజార్హత్నూర్ పీహెచ్సీ వైద్యసిబ్బంది ఆధ్వర్యంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. వైద్యసిబ్బంది ఇంటింటికీ తిరిగి టీకాలు వేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
నార్నూర్, డిసెంబర్ 10 : తాడిహత్నూర్ సబ్సెంటర్లో వ్యాక్సినేషన్ తీరును ఎంపీడీవో రమేశ్ పరిశీలించారు. వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గడువులోగా ప్రతి గ్రామంలో వందశాతం వ్యాక్సిన్ పూర్తి చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఉపసర్పంచ్ విష్ణుఫడ్ ఉన్నారు.
వ్యాక్సినేషన్పై అవగాహన
ఇంద్రవెల్లి, డిసెంబర్ 10: మండలంలోని హీరాపూర్ గ్రామంలో ఎంపీడీవో పుష్పలత పర్యటించారు. ఆదివాసులకు వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించారు. ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సిన్ వేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగోరావ్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
తాంసి మండలంలో..
తాంసి, డిసెంబర్ 10: తాంసి, గిరిగాం, పొన్నారి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలను మండల వైద్యాధికారి నర్మద పరిశీలించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీవో సుధీర్రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ నగేశ్, ఏఎన్ఎంలు సుగుణ, లక్ష్మి, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.