మంచిర్యాలటౌన్, అక్టోబర్ 10: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే దివాకర్రావు మంచిర్యాల పట్టణంలోని వికాస్నగర్లో శ్రీదుర్గా భవానీ మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతోపాటు మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి, నాయకులు రవీందర్రెడ్డి, జగన్మోహన్రావు, పల్లపు రాజు, తదితరులు పూజల్లో పాల్గొన్నారు. అనంతరం టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి, చంద్రకళ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలంతా ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీదుర్గాభవాని మండలి సభ్యులు, వికాస్నగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు చేసిన మున్సిపల్ చైర్పర్సన్
బెల్లంపల్లిటౌన్, అక్టోబర్ 10 : పట్టణంలోని దుర్గామాత మండపాల్లో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 11వ వార్డులో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద ఆదివారం మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, శ్రీధర్ దంపతులు పాల్గొన్నారు. దుర్గామాత వద్ద వారు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పాల్గొన్నారు.
విజయదశమి ఉత్సవాలు విజయవంతం చేయాలి
బెల్లంపల్లిటౌన్, అక్టోబర్ 10 : హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా విజయదశమి రోజున పట్టణంలోని తిలక్స్టేడియంలో సాయంత్రం 6 గంటలకు రావణాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మాజీ ఎంపీ గడ్డం వివేక్ హాజరవుతారని పేర్కొన్నారు. బెల్లంపల్లి పట్టణ, పరిసర ప్రాంత మండలాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.