యూనియన్ అధ్యక్షుడు వెంకట్రావ్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
కైర్గూడ ఓసీపీలో గేట్ మీటింగ్
రెబ్బెన, ఆగస్టు 10 : టీబీజీకేఎస్తోనే కార్మికుల హక్కు లు సాధ్యమని టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని కైర్గూడ ఓసీపీలో మంగళవారం ఏ ర్పాటు చేసిన గేట్ మీటింగ్కు వారు ము ఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ వయసు 60 నుంచి 61 ఏళ్ల కు పెంచడంతో పాటు దివ్యాంగులు, పెళ్లి అయిన కూ తుళ్లకు కూడా కారుణ్య నియమకంలో సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారన్నారు. రానున్న రోజుల్లో 35 ఏళ్ల వయో పరిమితి 40 సంవత్సరాలకు పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ప లువురు కార్మికులు టీబీజీకేఎస్లో చేరగా, వారికి కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సంగెం ప్రకాశ్రావు, పిట్ కార్యదర్శి కార్నాథం వెంకటేశం, కార్పొరేట్ చర్చల ప్రతినిధి దారావత్ మంగీలాల్, కేంద్ర కమిటీ నాయకులు గెల్లి రాయలింగు, అబ్బు శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోటు శ్రీధర్రెడ్డి, ఏరియా కార్యదర్శులు పెండ్యాల అంజయ్య, సంపత్రావు, జీఎం కమిటీ సభ్యులు మారిన వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, సమ్మ య్య, రవీందర్, ఏరియా ఆర్గనైజింగ్ కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వా మి, పిట్ కార్యదర్శులు మెరుగు రమేశ్, సత్యనారాయణ, రాజే శం, లస్మయ్య, అసిస్టెంట్ పిట్ కార్యదర్శు లు బొంగు వెంకటేశ్, భాస్కరాచారి, కార్యాలయ ఇన్చార్జి వంగ మహేందర్రెడ్డి, రామారావు, చంద్రకుమా ర్, ఓరం కిరణ్, అంజయ్య, జంగపల్లి వెంక టి, వామన్, నరసయ్య, జహీర్, గోపాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.