54 గ్రామాల మీదుగా 108.4 కి.మీ. వరకు నాలుగు లేన్ల జాతీయ రహదారి
ఎన్విరో ఇన్ఫ్రా సొల్యూషన్ ద్వారా డీపీఆర్ సర్వే
నేడు జయశంకర్ జిల్లా మొగుల్లపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణ
శ్రీరాంపూర్, ఫిబ్రవరి 14 : తెలంగాణలోని నాలుగు జిల్లాలను కలుపుతూ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ జిల్లాల్లోని 54 గ్రామాల మీదుగా రూ. 2,795 కోట్లతో 108.4 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి చేపట్టేందుకు ప్రతిపాదనలు పూర్తి చేసింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్వా గ్రామ సమీపం నుంచి హన్మకొండ జిల్లా ఊరగొండ వరకు దీనిని నిర్మించనుండగా, ఆయా ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగు పడనున్నది.
శ్రీరాంపూర్, ఫిబ్రవరి 14 : తెలంగాణాలోని 4 జిల్లాలను కలుపుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మించనున్నది. మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జయశంకర్, హన్మకొండ జిల్లాలను కలుపుతూ 108. 4 కిలోమీటర్ల వరకు నాలుగు లేన్ల హైవే నిర్మించడానికి ప్రతిపాదనలు పూర్తి చేసింది. ఎన్విరో ఇన్ఫ్రా సొల్యూషన్ లిమిటెడ్ ప్రైవేట్ సంస్థ ద్వారా సర్వే(డీపీఆర్) చేయించారు. ప్రభు త్వం రూ. 2795 కోట్లతో నిర్మించనున్న ఈ రహదారి మంచిర్యాల జిల్లా జైపూర్ మం డలం నర్వా గ్రామం సమీపంలోని జద్దల్పూర్ జాతీయ రహదారి నుంచి మొదలవుతుంది. జిల్లాలోని 14 గ్రామాల్లో 21.6 కిలో మీటర్లు, పెద్దపల్లి జిల్లాలోని 16 గ్రామాల్లో 37.96 కిలో మీటర్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 14 గ్రామాల్లో 25 కిలో మీటర్లు, హన్మకొండ జిల్లాలోని 10 గ్రామాల్లో 23.8 కిలోమీటర్ల దూరం వరకు గ్రీన్ఫీల్డ్ హైవే రహదారి నిర్మించనున్నారు. మంచిర్యాల జిల్లా నర్వా గ్రామం నుంచి కుందరాం గోదావరి అవతల సుందిళ్ల నుంచి భూపాలపల్లి జిల్లా మొగుల్లపల్లి మండలం, టేకుమట్ల మండలం, చిట్యాల మండలాల మీదుగా హన్మకొండ జిల్లా ఊరగొండ వరకు నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మించనున్నారు. ఇందుకోసం 54 గ్రామాల్లో భూములు తీసుకోవాల్సి ఉంటుంది. రహదారి కోసం ప్రభుత్వ భూమి 41.459 హెక్టార్లు, ప్రైవేట్ భూమి 541.670 హెక్టార్లు, అటవీ శాఖ భూమి 12.558 హెక్టార్లుగా ప్రతిపాదనలు రూపొందించారు.
నేడు మొగుల్లపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణ
భూపాలపల్లి (జయశంకర్) జిల్లాలోని మొగుల్లపల్లిలోని మహాత్మాజోతీబాఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్సియల్ కాంప్లెక్స్లో మంగళవారం 14 గ్రామాల ప్రజలతో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి శాఖ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ (ఎన్హెచ్) కిషోర్ రఘునాథ్పూలే పేర్కొన్నారు. ఈ జాతీయ రహదారి నిర్మాణంతో 4 జిల్లాలకు రవాణా సౌకర్యం మెరుగు పడడమేగాకుండా మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన జాతీయ రహదారులకు అనుసంధానంగా ఈ హైవే ఉంటుందని పేర్కొన్నారు.