జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు
అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసం కార్యక్రమాలు
కాగజ్నగర్ రూరల్, సెప్టెంబర్ 9: గర్భిణులు, బాలింతులు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని జడ్పీవైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు అన్నారు. మండలంలోని ఈస్గాం పంచాయతీలోని అంగన్ వాడీ కేంద్రం -3లో గురువారం ‘పోషణ్ మాసం’ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం ఆవరణలో ఎంపీపీ చీపురుశెట్టి శంకర్తో కలిసి మొక్కలను నాటారు. అంతకుముందు గ్రామంలో ర్యాలీ తీశారు. అంగన్వాడీ కే్రందంలో పోషక విలువలు ఉండే ఆకు కూరలు, పం డ్లు తదితర వాటిని ప్రదర్శించి వివరించారు. అలాగే జగన్నాథ్పూర్లో ర్యాలీ తీసి ఆవరణలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుశీల్రెడ్డి, సీడీపీవో సురేఖ, ఐసీడీఎస్ సూపర్వైజర్ భద్రమ్మ, ఎంఈవో భిక్షపతి, ఎంపీటీసీ కుమార్, వైస్ ఎంపీపీ స్వదేశ్ శర్మ, జగన్నాథ్పూర్ అంగన్వాడీ టీచర్ తార, సర్పంచ్ రవి, నారాయణ, హన్మంతు, మహబూబ్, అన్వర్, శంకర్, గర్భిణులు, బాలింతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సిర్పూర్(టీ), సెప్టెంబర్ 9 : మండలకేంద్రంలోని రైల్వేస్టేషన్ కాలనీ అంగన్వాడీ సెంటర్లో న్యూట్రీ గార్డెన్లో ఎంపీపీ చునార్కర్ సు వర్ణ, జడ్పీటీసీ నీరటి రేఖ మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పం చ్ తఫిమా పర్వీన్, ఎంపీటీసీలు కారెం శైలజ, సుహైల్ అహ్మద్, ఉప సర్పంచ్ తోట మహేశ్, సీడీపీవో విజయలక్ష్మి, ఎంపీడీవో రాజేశ్వర్, ఈవో కృష్ణమూర్తి, నాయకులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
కౌటాల, సెప్టెంబర్ 9 : స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రీషన్ గార్డెన్లను ఏర్పాటు చేయాలని ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్, మండల ప్రత్యేకాధికారి రవీందర్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో న్యూట్రీషన్ గార్డెన్ను గురువారం ఏర్పాటు చేశారు. ఇందులో ఆకుకూరలు, కూరగాయల విత్తనాలను నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో నస్రుల్లాఖాన్, ఎంఏవో రాజేశ్, ఎంఈవో సోమయ్య, సర్పంచ్ మౌనిశ్, ఉపసర్పంచ్ తిరుపతి, ఐసీడీఎస్ సూ పర్వైజర్ కావ్య, ఏఈవో ఘన్శ్యాం, కార్యదర్శి సాయికృష్ణ, హెచ్ఎం ఎంఎల్ రాజు, అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు.
దహెగాం,సెప్టెంబర్ 9: పెరటితోటల సాగుపై దృష్టి పెట్టాలని జడ్పీటీసీ తాళ్లపల్లి శ్రీరామారావు, డీఆర్డీవో రవికృష్ణ అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురవారం ‘పోషణ్ మాసం’ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పాల్గొని న్యూట్రీగార్డెన్లో 12 రకాల కూరగాయల విత్తనాలను నాటారు. అనంతరం మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంభగౌని సంతోష్గౌడ్, సర్పంచ్ పుప్పాల లక్ష్మి, స్పెషల్ ఆఫీసర్ సాంబశివరావు, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో రాజేశ్వర్గౌడ్, ఏపీవో చంద్రయ్య, ఏపీఎం చంద్రశేఖర్, కార్యదర్శి ప్రణీత్బాబు, ప్రధానోపాధ్యాయురాలు విజయనిర్మల, అంగన్వాడీ కార్యకర్తలు,విద్యార్థులు పాల్గొన్నారు.
కెరమెరి, సెప్టెంబర్ 9: చిన్నారుల్లో పోషక లోపాన్ని అధిగమించడానికే న్యూట్రీ గార్డెన్లను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా సెక్టోరియల్ అధికారులు సత్తయ్య, సత్యనారాయణ మూర్తి, భరత్ కుమార్ పేర్కొన్నారు. ‘పోషణ్ మాసం’లో భాగంగా ఝరి కొలాంగూడ అంగన్వాడీ కేంద్రం ఆవరణలో కూరగాయల మొక్కలను నాటారు. ఝరి సర్పంచ్ కుమ్రం నాణేశ్వర్, అంగన్వాడీ టీచర్ మడవి సావిత్రి, కార్యదర్శి వాజీద్పాషా, తదితరులు ఉన్నారు.
పెంచికల్పేట్ , సెప్టెంబర్ 9 : మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో స్థానిక సర్పంచ్లతో కలిసి రైతుబం ధు సమితి మండలాధ్యక్షుడు చౌదరి తిరుపతి న్యూట్రీ గార్డెన్లను ప్రా రంభించారు. సర్పంచ్లు దుర్గం రాజన్న, కమల, కావ్య, ఎంపీటీసీ రాజన్న, మండల కోఆప్షన్ సభ్యుడు సాజీద్, ఎంపీడీవో శ్రీనివాస్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు యాదగిరి, కస్తూర్బా ఎస్వో కవిత, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.