ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ ఎం డేవిడ్
జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమావేశం
ఎదులాపురం, ఏప్రిల్ 9 : కరోనా వ్యాప్తి ని అ రికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ ఎం డేవిడ్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ప్ర భుత్వ ఆదేశాలకు అనుగుణం గా అన్ని స్థాయిల అధికారులు కలిసికట్టుగా పనిచేసి, ప్రజల ఆరోగ్య స్థితిగతుల దృష్ట్యా పనిచేయాలన్నారు. 45 ఏం డ్లు నిండిన ప్రజాప్రతినిధు లు, ఉద్యోగులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూ చించారు. నిబంధనలు పా టించని వారికి జరిమానా వి ధించాలని మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రైతు బజార్లు, సంత లు, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, వైన్షాపుల వద్ద రద్దీ లేకుండా చూడాలని తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలో ముఖ్యం గా నేతాజీ చౌక్, గాంధీచౌక్, అంబేద్కర్చౌక్, రైతు బజార్ వంటి ప్రదేశాల్లో మున్సిపల్, పోలీస్ అధికారులు పర్యటించి రద్దీ లేకుండా చూడాలన్నారు.
అనంతరం అదనపు ఎస్పీ వినోద్కుమార్ మాట్లాడుతూ.. కరోనాపై ప్రజలను చైతన్యపర్చేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గతం లో మాదిరిగానే పోలీస్ యంత్రాంగం సహకరిస్తుందని తెలిపారు. ఆ తర్వాత ఆర్డీవో జాడి రాజేశ్వర్ మాట్లాడుతూ.. మం డల స్థాయిలో కమిటీలు వేసినట్లు చెప్పారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ మాస్కు ధరించేలా ఈ కమిటీలు పనిచేస్తాయని తెలిపారు. డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ.. కరోనా బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా నియమాలు పాటించాలని సూచించారు. జడ్పీ సీఈవో గణపతి, డీపీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శైలజ, ఆయా శాఖల అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.