బెల్లంపల్లిరూరల్, డిసెంబర్ 8: ఈ యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు లేనందున రైతులు ఇత ర పంటల సాగుపై దృష్టి పెట్టాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి సూచించారు. మండలంలోని బూదాకుర్ధు గ్రామంలో వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో బుధవారం ఇతర పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వరికి బదులు శనగలు, నువ్వులు, మినుములు, పెసర్లు, జొన్నలతో పాటు కూరగాయల సాగుపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఏడీఏ సురేఖ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి డీ రాజేందర్, మండల వ్యవసాయాధికారి సుద్దాల ప్రేమ్కుమా ర్, వ్యవసాయ విస్తరణ అధికారులు నాగదీప్తి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆరుతడి పంటలు వేయాలి
తాండూర్, డిసెంబర్ 8 : రైతులు యాసంగిలో ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ భారతీ హోళికేరి పేర్కొన్నారు. మండలంలోని రేచిని, గంపలపల్లి, రేపల్లెవాడ, కిష్టంపేట గ్రామా ల్లో ఇతర పంటల సాగుపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఆ యిల్ పామ్ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తున్నదన్నారు. సీడ్ ప్రొడక్షన్ కంపెనీతో అవగాహన ఉన్నవాళ్లు వరి వేసుకోవచ్చన్నారు. సర్పంచ్ దుర్గుబాయి, ఎంపీటీసీ శంకర్, బెల్లంపల్లి ఏడీ సురేఖ, ఎంపీడీవో శశికళ, ఏవో కిరణ్మయి, ఏఈ వో ప్రతిభ, రైతులు పాల్గొన్నారు.
సబ్ సెంటర్ తనిఖీ..
రేచినిలోని పీహెచ్సీ సబ్ సెం టర్ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఎంపీడీవో శశికళ, డాక్టర్ కుమారస్వామిని ప లు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ఈ నెలాఖరులోగా లక్ష్యం చేరుకోవాలని సూచించారు. పీహెచ్సీలో రికార్డులను పరిశీలించారు.