ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి
మాలేగాంలో మేకలు, కూరగాయల సంత ప్రారంభం
కుభీర్, డిసెంబర్ 8: గ్రామాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడేందుకు సంతలు ఎంతో దోహ దం చేస్తాయని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని మాలేగాం గ్రామం లో కొత్తగా వీడీసీ ఆధ్వర్యంలో బుధువారం ఏ ర్పాటు చేసిన మేకలు, కూరగాయల సంత(అంగడి)ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కూరగాయలు, ధాన్యాలు, పండ్లు, మేకలు, గొర్రెల క్రయవిక్రయాలకు వేదికగా ఈ సంత ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడనుందని పేర్కొన్నారు.ప్రజల సౌకర్యార్థం గ్రామంలో సంతను ఏర్పాటు చేయించిన గ్రామ పెద్దలను ఆయన అభినందించారు. ఈ సందర్భం గా మాలేగాంను మండల కేంద్రంగా మార్చాలని పలువురు గ్రామస్తులు ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేను గ్రామాభివృద్ధ్ది కమిటీ ఆధ్వర్యంలో మల్లాపురం రమేశ్, స్థానికులు శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమం లో సర్పంచ్ మహిపాల్రెడ్డి, వైస్ ఎంపీపీ మొహియోద్దీన్, నిగ్వా ఎంపీటీసీ దొంతుల దేవీదాస్, సింగిల్విండో చైర్మన్ గంగాచరణ్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, డైరెక్టర్ సంతంరెడ్డి, మాజీ సర్పంచ్ కే శంకర్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు సాయి ప్రసాద్రెడ్డి, గంగారావు, వీ రేందర్, మల్లారెడ్డి, విక్రమోద్దిన్, ముక్కెర ధర్మ య్య, తోటోల్ల అనంద్రెడ్డి, తోటోల్ల సాయరెడ్డి, గడ్డం భుజంగ్రావు, గొల్ల పెద్ద సాయిలు, బంజ పాపయ్య, గాడె గంగయ్య, శేరే విఠల్, జంగం మల్లికార్జున్, టీఆర్ఎస్ నాయకులు, ఆయా గ్రా మాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.