పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్
హేటిగూడలో పర్యటన
చింతలమానేపల్లి , సెప్టెంబర్ 8 : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం మండలంలోని హేటిగూడ గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా పారిశుధ్య పనులను సక్రమంగా నిర్వర్తించాలని, గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బందికి సూచించారు. ఇంటి పరిసరాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి యువకులు తోడ్పడాలని సూచించారు. గ్రామంలో పాఠశాల హాలులో మురుగునీరు నిల్వ ఉండడంతో ఆయన పాఠశాల భవనాన్ని, మరుగుదొడ్లను పరిశీలించారు. వెంటనే మరుగుదొడ్లు మంజూరు చేస్తామని గ్రామస్తులకు తెలిపారు. పారిశుధ్య పనులపై అశ్రద్ధ వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ బికర్ణదాస్, ఎంపీడీవో సుధాకర్రెడ్డి, ఇన్చార్జి కార్యదర్శి కైలాస్, సర్పంచ్ ఇంద్రాపాల్, అంగన్వాడీ, గ్రామస్తులు , తదితరులు ఉన్నారు.