ఎదులాపురం, జూన్ 8 : ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారుల ఎంపికకు ఇంటర్వూలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్ అన్నారు. కార్యాలయంలో ఎల్డీఎం చంద్రశేఖర్, డీఆర్డీఏ కార్యాలయం నుంచి గంగన్న సమక్షంలో నేరడిగొండ, గాదిగూడ, సిరికొండ, ఇంద్రవెల్లి, నార్నూర్ మండలాలకు చెందిన దరఖాస్తుదారులకు మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. 274 మంది దరఖాస్తు చేసుకోగా 114 మంది హాజరయ్యారు. వాహనాల యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పా టు చేసి ఏఎంవీఐ అభిలాశ్, డీఎస్సీడీవో, ఎస్సీ కార్పొరేషన్ ఇన్చార్జి ఈవో భాగత్ సునీత పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. ఎలాంటి సందేహాలు ఉ న్నా.. నేరుగా కార్యాలయంలో సంప్రదించాలన్నారు. అన్ని మండలాల అభ్యర్థుల ఇంటర్వ్యూలు పూర్తయిన తర్వాతే లబ్ధిదారులను జాబితాను నోటిస్బోర్డుపై ప్రదర్శిస్తామని చెప్పారు.
నిర్మల్ అర్బన్, జూన్ 8 : జిల్లా కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో ఎస్సీ కా ర్పొరేషన్ ఈడీ హన్మాండ్లు లబ్ధిదారుల ఎంపికకు ఇంటర్వూలు నిర్వహించారు. దాదాపు 200 మంది హాజరయ్యారు. అర్హుల జాబితాను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు, ఎంవీఐ కవిత, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.