తాండూర్ మండల పరిషత్ సర్వ సభ్య సమావేశంలో ఎంపీపీ ప్రణయ్కుమార్
తాండూర్, ఆగస్టు 7 : అధికారులు విధులను నిర్లక్ష్యం చేయకుండా ప్రజాప్రతినిధులతో కలిసి చిత్తశుద్ధితో పనిచేయాలని ఎంపీపీ పూసాల ప్రణయ్కుమార్ ఆదేశించారు. తాండూర్ మండల సర్వసభ్య సమావేశాన్ని శనివారం ఎంపీపీ పూసాల ప్రణయ్కుమార్ అధ్యక్షతన మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. తాండూర్ సింగిల్విండో చైర్మన్ కీ. చౌళ్ల సత్యనారాయణ అకాల మృతిపై సభలో రెండు నిమిషాలు మౌ నం పాటించారు. అనంతరం ఆయా శాఖల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. కొందరు సభ్యులు కొందరు అధికారుల తీరుపై లేవనెత్తిన సమస్యలపై ఎంపీపీ మాట్లాడారు. పాఠశాలల్లో ప్రహారీ, వంట గదుల నిర్మాణాలు, పాఠశాలల మరమ్మతుపై ఎంఈవో ప్రభాకర్ను సభ్యులు ప్రశ్నించారు. ఆర్వీఎంతో మాట్లాడి నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూస్తామని ఎంపీపీ తెలిపారు. సమావేశానికి గైర్హాజరవుతున్న సింగిల్విండో కార్యాలయ సెక్రటరీపై సభ్యులు ఫిర్యాదు చేశారు. సెక్రటరీపై చర్యలు తీసుకుంటామని, సమావేశానికి రాని అధికారులపై తీర్మానం చేసి కలెక్టర్కు పంపాలని ఎంపీడీవో శశికళకు ఎంపీపీ సూచించారు. ఉపాధి హామీ జాబ్ కార్డులు అందించి, పని కల్పించాలని జీఎస్ అధికారి సత్యనారాయణను జడ్పీటీసీ బానయ్య, ఎంపీటీసీ సభ్యులు ప్రశ్నించారు. మండలంలో కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య పెంచాలని, పీహెచ్సీలో అంబులెన్స్, మండలానికి 108, డాక్టర్లు, సిబ్బంది డిఫ్యూటేషన్లపై ఉన్నారని వారి డిఫ్యూటేషన్ రద్దు చేసి తిరిగి వారిని రప్పించాలని సభ్యులు సభ దృష్టికి తీసుకు వచ్చారు.
వీధి బల్బులు అమర్చేందుకు ఎల్సీ ఇవ్వడంలో జాప్య చేస్తున్నారని, వ్యవసాయ కనెక్షన్లు వివరాలు తెలుపాలని, ఇండ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ వైర్లను తొలగించాలని సూచించారు. 133 కేవీ లెన్ను ఫొర్లైన్ టవర్స్కు అనుసంధానం చేయాలంటే ప్రభుత్వానికి రూ. 14 లక్షల డీడీ కట్టాల్సి ఉంటుందని విద్యుత్ ఏఈ ప్రభాకర్ తెలిపారు. దీంతో ఎంపీపీ, జడ్పీటీసీ మాట్లాడుతూ వివరాలు అందజేస్తే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న ఉచిత విద్యుత్ సౌకర్యం నాయీ బ్రాహ్మణులు, రజకులు, నిరుపేదలకు సక్రమంగా అందేలా చూడాలని సభ్యులు సూచించారు. పనులు, సమస్యల పరిష్కారంపై పలు తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దాగాం నారాయణ, ఎంపీటీసీలు మాసాడి శ్రీదేవి, పెర్క రజిత, గోమాస స్వాతి, రెబ్బెన యశోద, సిరంగి శంకర్, మొగిలి శంకర్, సర్పంచ్లు పూదరి నవీన్, అస్ప రమేశ్, చీమల శంకర్, దాగాం శంకరమ్మ, గాజుల సుజాత, రేపాక సునీత, గజ్జెల బక్కమ్మ, దుర్గుబాయి, ఏల్పుల రజిత, వివిధ శాఖల అధికారులు, తదితరులున్నారు.