గూడెం-అహేరి అంతర్రాష్ట్ర వంతెన ప్రారంభం
పరిశీలించిన ఎమ్మెల్యే కోనప్ప, ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర
చింతలమానేపల్లి, ఆగస్టు 6 : ఈ నెల 11న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు వస్తారని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. చింతలమానేపల్లి మండలం గూడెం-అహేరి అంతర్రా ష్ట్ర వంతెన ప్రారంభోత్సవానికి ఆయన హాజరుకానుండగా, శుక్రవారం కోనప్ప, ఎస్పీ వైవీఎస్ సుధీంద్రతో కలిసి స్థలాన్ని పరిశీలిం చారు. కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 11న జిల్లాకు మం త్రి కేటీఆర్ రానున్నారని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నా రు. ఎస్పీ వైవీఎస్ సుధీంద్రతో కలిసి గూడెం, అహేరి అం తర్రాష్ట్ర వంతెన వద్ద స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిధులు మంజూరు చేయడంతో గూడెం- అహేరి అంతర్రాష్ట వంతెన పనులు పూర్తయ్యాయన్నారు. ఈ నెల 11 న మంత్రి కేటీఆర్ వంతెనను ప్రారంభించనున్నారని తెలిపారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున తరలివచ్చి కేటీఆర్కు ఘన స్వాగతం పలకాలని ఆయన కోరారు. ఆయన వెంట ఎంపీపీ డుబ్బుల నానయ్య, కాగజ్నగర్ ఆర్డీవో చిత్రు తహసీల్దార్ బికర్ణదాస్, సీఐ బుద్దె స్వామి, ఎస్ఐ సందీప్ కుమార్, కోఆప్షన్ సభ్యుడు నాజీమ్ హుస్సేన్, మాజీ ఎంపీపీ డుబ్బుల వెంకయ్య, నీలా గౌడ్, డోకె నారాయణ, డోకె వెంకన్న, శంకర్ ఉన్నారు.
.