జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి
ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి మార్కెట్ కమిటీ యార్డులో కార్యక్రమానికి హాజరు
ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, జూలై 6 : మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. జిల్లాకేంద్రంలోని మార్కెట్ కమిటీ యార్డు ఆవరణలో మంగళవారం నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఏఎంసీ చైర్పర్సన్ వనజతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం యార్డు ఆవరణలో శ్రమదానంలో పాల్గొని చెత్తను ఎత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వనాల పెంపుతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ గాదెవేణి మల్లేశ్, మాజీ చైర్మన్ వెంకన్న, సభ్యులు శ్రీనివాస్ గౌడ్, శ్యాంరావు, మల్లేశ్, ఆనంద్రావు, రోషన్, పోశన్న , ట్రేడర్లు అశోక్, సంతోష్, ప్రత్యేక శ్రేణి కార్యదర్శి సోనియా, సూపర్వైజర్ మనోజ్ పాల్గొన్నారు.
భాగస్వాములవ్వాలి: అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డి
సిర్పూర్(టి), జూలై 6 : హరితహరంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. మండలంలోని వేంపల్లి, సిర్పూర్(టి), కర్జపల్లి గ్రామాల్లో మంగళవారం పర్యటించారు. వేంపల్లి ప్రకృతి వనంలో ఎంపీపీ చునార్కర్ సువర్ణ, జడ్పీటీసీ నీరటి రేఖతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి, హరితహరాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. తహసీల్దార్ నదీముల్లాఖాన్, వైస్ ఎం పీపీ ఈర్త సత్యనారాయణ, ఎంపీడీవో రాజేశ్వర్, ఈజీఎస్ ఏపీ వో రామ్మోహన్, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.
ఆర్ఎంపీ, పీఎంపీ ఆధ్వర్యంలో ..
మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం సిర్పూర్(టి) మండల ఆర్ఎంపీ, పీఎంపీల ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ కల్యాణి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆర్ఎంపీ మండలాధ్యక్షుడు చంద్రగిరి తులసీదాస్, ఆర్ఎంపీలు రతన్, ఆబ్రార్, అజ్జు, తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో అదనపు కలెక్టర్ పర్యటన
కౌటాల రూరల్, జూలై 6 : మండలంలోని వీరవెల్లి, సాండ్గాం గ్రామాల్లో అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి మంగళవారం పర్యటించారు. వీరవెల్లిలోని ప్రకృతి వనాన్ని పరిశీలించారు. మొక్కలు నాటి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సిబ్బందికి సూచించారు. అనంతరం గ్రామస్తులకు మొక్కలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ విశ్వనాథ్, సీపీవో రవీందర్, ప్రత్యేక అధికారి శ్రీధర్రాజు, ఎంపీడీవో నస్రుల్లాఖాన్, ఏఈ పూర్ణిమ, ఈసీ అహ్మద్, పంచాయతీ సెక్రటరీ భాస్కర్, రాజేశ్వరి, సర్పంచ్ దామోదర్, దృపదాబాయి, గ్రామస్తులు పాల్గొన్నారు.
విర్దండిలో ప్రత్యేకాధికారి పల్లెనిద్ర..
కౌటాల, జూలై 6 : మండలంలోని విర్దండి గ్రామంలో సోమవారం రాత్రి మండల ప్రత్యేకాధికారి రవీందర్, ఎంపీవో శ్రీధర్ రాజు పల్లె నిద్ర చేశారు. అంతకుముందు గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాన్ని అభివృద్ది పథంలో తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి గ్రామస్తులతో కలిసి చర్చించారు. మంగ ళవారం ఉదయం శ్మశాన వాటిక, సెగ్రిగేషన్ షెడ్డు పనులను పరిశీలించారు. సర్పంచ్ మడావి రేణుక, కార్యదర్శి గణేశ్, ఉపసర్పంచ్ బండు, ఏఎస్వో ప్రసాద్ గ్రామస్తులు ఉన్నారు.
కమ్మర్గాంలో ఎంపీడీవో శ్రీనివాస్ ..
పెంచికల్పేట్, జూలై 6 : మండలంలోని కమ్మర్గాం, మురళీగూడ గ్రామాల్లో ఎంపీడీవో శ్రీనివాస్ సోమవారం రాత్రి పల్లె నిద్ర చేశారు. మంగళవారం ఉదయం వీధుల్లో తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డంప్యార్డు, శ్మశానవాటిక, ప్రకృతి వనాలను పరిశీలించారు. మొ క్కలు నాటి ఏపుగా పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించా రు. సర్పంచ్లు మధునయ్య, ఈశ్వరి, ఉప సర్పంచ్ ప్రభాకర్, ఎంపీవో గంగాసింగ్, పంచాయతీ కార్యదర్శులు శాంతయ్య, బాబురావు, అంగన్వాడీలు, ఆయాలు పాల్గొన్నారు.
గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు..
చింతలమానేపల్లి , జూలై 6 : మండలంలోని బాలాజీఅన్కోడ గ్రామంలో జడ్పీటీసీ డుబ్బుల శ్రీదేవి మొక్కలు నాటి నీరు పోశారు. అదేవిధంగా వేర్వేరు చోట్ల ఎంపీపీ డుబ్బుల నాన య్య, ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటి రక్షించాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో సుధాకర్రెడ్డి, ఏపీఏ రాజన్న, మాజీ ఎంపీపీ డుబ్బుల వెంకయ్య, సర్పంచ్ రౌతు సుజాత ఉప సర్పంచ్ నందు, పంచాయతీ కా ర్యదర్శి సుజాత, మల్లికార్జున్, అంగన్వాడీ కార్యకర్తలు శోభ, సత్తయ్య, ఆశ వర్కర్లు రజిత, నిర్మల, గ్రామస్తులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న పల్లెప్రగతి..
రెబ్బెన,జూలై 6: మండలంలో పల్లెప్రగతి కొనసాగుతున్నది. నక్కలగూడలో ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. రెబ్బెనలోని పెద్ద కాలువలలో చెత్తాచెదారం తొలగించారు. ఎం పీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోష్, పీఏసీఎస్ చైర్మ న్ కార్నాథం సంజీవ్, వైస్ చైర్మన్ రంగు మహేశ్, వైస్ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోటు శ్రీధర్రెడ్డి, సర్పంచ్లు చెన్న సోమశేఖర్, దుర్గం రాజ్యలక్ష్మి, బొమ్మినేని అహల్యాదేవి, పోటు సుమలత, పందిర్ల వినో ద, ఉపసర్పంచ్ మడ్డి శ్రీనివాసగౌడ్, ఆలయ చైర్మన్ వోల్వోజి వెం కటాచారి, స్పెషల్ ఆఫీసర్ రబ్బాని, ఎంపీడీవో సత్యనారాయణసింగ్, ఎంపీవో అంజాద్పాషా, డీఈ రాజన్న, ఏఈ ఖా దీర్, నాయకులు జుమ్మిడి ఆనందరావు, దుర్గం తిరుపతి ఉన్నారు.