మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
డిగ్రీ కళాశాల ఆవరణలో పిచ్చిమొక్కలు తొలగింపు
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 5 : ప్రజలు పట్టణ పరిశుభ్రతలో భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం స్వచ్ఛ ఆదిలాబాద్ కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ స్వయంగా బ్లేడ్ కట్టర్తో కళాశాల ఆవరణలోని పిచ్చిమొక్కలు తొలగించారు. అదే విధంగా కౌన్సిలర్లు, కళాశాల సిబ్బంది, మున్సిపల్ కార్మికులు కళాశాల ఆవరణలో చెత్తాచెదారం తొలగించి పరిసరాలు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు చెత్తాచెదారం కాలనీలోకి వచ్చే మున్సిపల్ వాహనాల్లో వేయాలన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా ప్రతి ఆదివారం స్వచ్ఛ ఆదిలాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. డెంగీ, మలేరియా వ్యాధుల నుంచి కాపాడుకోవాలంటే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రకాశ్, లక్ష్మణ్, ప్రిన్సిపాల్ ప్రతాప్సింగ్ పాల్గొన్నారు.
25 క్వింటాళ్ల బియ్యం అందజేత
చాంద(టీ) నది వద్ద ఉన్న అయ్యప్ప ఆలయంలో ప్రతి రోజూ వందలాది మంది అయ్యప్ప స్వాములకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. దాతల సహకారంతో ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. పట్టణంలోని జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25 క్వింటాళ్ల బియ్యాన్ని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. బియ్యం దానానికి ముందుకు వచ్చిన మున్సిపల్ చైర్మన్ను ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు.