నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
పలుచోట్ల విస్తృతంగా పర్యటన
టీకాలు వేయించిన కలెక్టర్, డీఎంహెచ్వో
నిర్మల్ చైన్గేట్, డిసెంబర్ 4: అర్హులందరూ తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అలీ పేర్కొ న్నారు. నిర్మల్లోని 17 వార్డు ఆశ్ర కాలనీ, తదిత ర ప్రాంతాల్లో కలెక్టర్ వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించారు. దగ్గరుండి టీకాలు వేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త వేరి యంట్ ఒమిక్రాన్పై ప్రజలు అప్రమత్తంగా ఉం డాలన్నారు. ప్రజలంతా మాస్కులు ధరించి భౌతి క దూరం పాటించాలన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకోవాలన్నారు. అదన పు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఎంహెచ్వో ధన్రాజ్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కమిషనర్ సత్యనారాయణరెడ్డి, స్థానిక కౌన్సిలర్ ఫరాగ్ ఫర్వీన్, వైస్ చైర్మన్ ఎస్కే సాజిద్, కౌన్సిల ర్లు పూదరి రాజేశ్వర్, గండ్రత్ రమణ, నాయకు లు అన్వర్ పాషా, తారక రఘువీర్, జాఫర్, వసీ మ్, ముక్రం, గౌస్, నౌషద్, హైమత్పాషా, హసి ఫ్, అఫ్రోజ్, అధికారులు పాల్గొన్నారు.
వంద శాతం పూర్తి చేయాలి
పెంబి, డిసెంబర్ 4 : వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని దళితవాడలో నిర్వహించిన వ్యాక్సినేషన్ డ్రైవ్ను పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వల్ల కలిగే ఉపయోగాలను ప్రజలకు వివరించారు. ఈ నెల చివరి వరకు ప్రతి గ్రామంలో టీకా కార్యక్రమాన్ని వంద శాతం పూర్తిచేయాలని అధికారులను ఆదే శించారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను ఎదుర్కొ నేందుకు ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలన్నారు. ప్రజలు నిబంధనలు పాటించాలని సూచించారు. జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, తహసీల్దార్ రాజ్ మోహన్, సర్పంచ్ పూర్ణచందర్ గౌడ్, వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, అంగన్ వాడీ, ఆశ వర్కర్లు ఉన్నారు.
కాలినడకన వెళ్లి..
నిర్మల్ చైన్గేట్, డిసెంబర్ 4 : పెంబి మండ లం తాటిగూడలో అడవిలో ఉన్న మేకల కాప రులటీకాలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదని డీఎంహెచ్వో ధన్రాజ్ దృష్టికి సిబ్బంది తీసుకొచ్చారు. దీంతో ఆయన స్పందించి సిబ్బం దితో కలిసి రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి వారు టీకాలు తీసుకునేలా ఒప్పించి వేయించా రు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.