జడ్పీ సీఈవో గణపతి
వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు
సిరికొండ, డిసెంబర్ 4 : ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయాలని జడ్పీ సీఈవో గణపతి వైద్యసిబ్బందికి సూచించారు. మండల కేంద్రంతో పాటు రాంపూర్ గ్రామంలో పిట్టబొంగరం, నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ తీసుకున్న వారికి వైరస్ నుంచి రక్షణ లభిస్తుందన్నారు. అందరూ మాస్కులు ధరించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో సురేశ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వైద్యసిబ్బంది విజయ్, జలేంధర్, సుశీల ఉన్నారు.
వ్యాక్సిన్తోనే రక్షణ
ఇంద్రవెల్లి, డిసెంబర్ 4: కరోనా నివారణ వ్యాక్సిన్తోనే రక్షణ సాధ్యమని డీపీవో శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని భీంనగర్, మండలంలోని ధనోరా(బీ) గ్రామాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్పై ఉన్న అపోహలను ప్రజలు నమ్మవద్దన్నారు. వైద్య సిబ్బందితో పాటు గ్రామ పంచాయతీ అధికారులు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించి వ్యాక్సిన్ వేయించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీవో సంతోష్, సర్పంచ్ కోరెంగా గాంధారి, ఉపర్పంచ్ గణేశ్టేహెరే, ఈవో శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ శ్రీకాంత్, హెల్త్ సూపర్వైజర్ జాదవ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సుంకట్రావ్, గ్రామ పంచాయతీ సిబ్బంది శంకర్లాల, నారాయణ ఉన్నారు.
నిబంధనలు పాటించాలి
బేల, డిసెంబర్ 4 : ఒమిక్రాన్ వైరస్ ప్రభావంతో ప్రమాదం పొంచి ఉందని ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించి వ్యాక్సిన్ తీసుకోవాలని మండల ప్రత్యేకాధికారి శంకర్ అన్నారు. మండల కేంద్రంతో పాటు పాఠన్, గణేశ్పూర్ గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. టీకాలు తీసుకొని వారికి వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 99 శాతం మొదటి డోస్ టీకా తీసుకున్నారని తెలిపారు. ఇంటికి వచ్చే వైద్య సిబ్బందికి సహకరించి టీకాలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట ఎంపీడీవో భగత్ రవీందర్, ఎంపీవో సమీర్ హైమద్, సర్పంచ్ ఫైజుల్లా ఖాన్, పంచాయతీ కార్యదర్శి సురేశ్, వైద్య సిబ్బంది, ఆశకార్యకర్తలు ఉన్నారు.