జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి సునీత రామకృష్ణ
ఎదులాపురం, డిసెంబర్ 4 : రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, బాధ్యతలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆదిలాబా ద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి సునీత రామకృష్ణ సూచించారు. జిల్లా కేంద్రంలోని వివే కానంద బీఎడ్ కళాశాలలో శనివారం నిర్వహిం చిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ముందు గా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారం భించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయ మూర్తి మంత్రి సునీత రామకృష్ణ మాట్లా డుతూ మహిళల రక్షణకు రాజ్యాంగంలో వివిధ చట్టాలు పొందుపర్చారని తెలిపారు. మహిళా కమిషన్ సభ్యురాలు మాట్లాడుతూ యువత, మహిళలు అన్ని రంగాల్లో సమానంగా రాణించాలని సూచిం చారు. కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమా దేశ్పాండే, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణారెడ్డి కళాశాల కరెస్పాండెంట్ దారట్ల కిష్టు, తదితరులు పాల్గొన్నారు.