బోథ్, డిసెంబర్ 4: ఒమిక్రాన్ వైరస్, థర్డ్వేవ్ పుట్టుకొస్తున్న సమయంలో మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ ముదావత్ నైలు తెలిపారు. శనివారం సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని సూచించారు. మాస్కులు ధరించని వారికి రూ.1000 జరిమానా విధిస్తామని తెలిపారు.
ఒమిక్రాన్ వైరస్పై అవగాహన
ఇచ్చోడ, డిసెంబర్ 4: మండల కేంద్రంలోని శివాజీ చౌక్లోఎస్ఐ గుర్లే రాకేశ్ ఒమిక్రాన్ వైరస్పై ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా నియంత్రణపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.
తలమడుగు, డిసెంబర్ 4: ఆరోగ్యం దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, లేకపోతే రూ.1000 జరిమానా విధిస్తామని తహసీల్దార్ ఇమ్రాన్ఖాన్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని బస్స్టాండ్ సమీపంలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం ఎంపీడీవో రమాకాంత్తో కలిసి తహసీల్దార్ ప్రభుత్వ దవాఖానను తనిఖీ చేశారు. మండలంలో కొవిడ్ వాక్సినేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటా తిరుగుతూ టీకాలు వేయాలని వైద్య సిబ్బందికి సూచించారు.
నార్నూర్, డిసెంబర్ 4 : గాదిగూడలో ఎస్ఐ చిప్పకుర్తి సురేశ్ మాస్కుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది దుర్వా సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
మాస్కులు పంపిణీ
బోథ్, డిసెంబర్ 4: మండల కేంద్రంలో ఎస్ఐ రాజు ప్రయాణికులతో పాటు ఆటోలు, జీపుల డ్రైవర్లకు మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎస్ఐ ఖైసర్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
స్వీయ రక్షణ పాటించాలి
నార్నూర్, డిసెంబర్ 4 : ప్రజలు స్వీయ రక్షణ తప్పనిసరిగా పాటించాలని ఎస్ఐ బుద్దె మల్లేశ్ అన్నారు. మాన్కాపూర్లో ఒమిక్రాన్ వైరస్పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇంద్రవెల్లి మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ నాగోరావ్, మాజీ ఎంపీపీ మెస్రం రూప్దేవ్, ఉపసర్పంచ్ రాయిసిడాం రూప్దేవ్, నానాజీ పాల్గొన్నారు.