రైతుబంధు సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు భోజారెడ్డి
బీజేపీ నాయకుల తీరుపై విమర్శలు
ఆదిలాబాద్ రూరల్, జనవరి 4 : కేంద్ర ప్రభుత్వం పరిధిలోని గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం బీజేపీ నాయకులు ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ఎంపీగా ఉన్న సోయం బాపురావ్ గిరిజన యూనివర్సిటీ గురించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. కేంద్రీయ విద్యాలయం కోసం ఏడేళ్ల క్రితమే భూమి ఇచ్చినా నేటి వరకు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించలేకపోయారని విమర్శించారు. సీసీఐని ప్రారంభించాలని కేంద్ర మంత్రులు, రాష్ట్రపతికి విన్నవించినా పట్టించుకోవడంలేదన్నారు. కేంద్రం నుంచి జిల్లాకే రూ.వెయ్యి కోట్ల ప్యాకేజీ తీసుకురావాలని సూచించారు. రూ.4 వేల కోట్లతో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంటే బీజేపీ నాయకులకు వంటబట్టడంలేదన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సెవ్వ జగదీశ్, మార్సెట్టి గోవర్ధన్, స్వరూపారాణి, మమత తదితరులు పాల్గొన్నారు.