చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి
ఓఎస్డీ శరత్చంద్ర పవార్
సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్
కోటపల్లి, డిసెంబర్ 3 : శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఓఎస్డీ శరత్చంద్ర పవార్ అన్నారు. కోటపల్లి మండలంలోని లింగన్నపేటలో మావోయిస్టు పీఎల్జీ వారోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక తనిఖీల్లో భాగంగా నిర్వహించిన కార్డన్సెర్చ్లో ఓఎస్డీ శరత్ చంద్ర పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఓఎస్డీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ, గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కల్పించడం, నేరాలు నిర్మూలించేందుకే ప్రతి గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. చట్ట వ్యతిరేక కార్డెన్ సెర్చ్ ద్వారా గుర్తించవచ్చని తెలిపారు. దొరికిపోతారని తెలిపారు. ఆపద సమయంలో 100 నంబర్కు డయల్ చేయాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య వార్తలను నమ్మవద్దన్నారు. గుట్కాలు, గంజాయి సాగు, అమ్మకం, కలప అక్రమ రవాణా, బెల్ట్ షాపుల నిర్వహణ, తదితర నేరాలకు పాల్పడే వారి సమాచారం పోలీసులు అందించాలని సూచించారు. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, అన్ని పత్రాలను కలిగి ఉండాలని సూచించారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించినా, హింసించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. కార్డన్ సెర్చ్ సందర్భంగా 21 ద్విచక్ర వాహనాలు, ఆటో, ట్రాక్టర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మావోయిస్టు సానుభూతిపరులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం ఓఎస్డీ చేతుల మీదు గా వృద్ధులకు దుప్పట్లు, యువతకు వాలీబాల్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ నరేందర్, చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు, టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్, కోటపల్లి ఎస్ఐ రవి కుమార్, నీల్వాయి ఎస్ఐ రహీం పాషా తదితరులు పాల్గొన్నారు.
కొత్తూర్ గ్రామంలో..
నెన్నెల, డిసెంబర్ 3: మావోయిస్టు (పీఎల్జీఏ) వారోత్సవాల నేపథ్యంలో రామగుండం సీపీ, డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి ఆదేశాల మేరకు నెన్నెల మండలంలోని కొత్తూర్లో శుక్రవారం పోలీసులు కార్డన్సెర్చ్ను నిర్వహించారు. బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్ ఆధ్వర్యంలో ఇళ్లలో సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని 28 ద్విచక్రవాహనాలను, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ కొత్త వ్యక్తులు, నేరస్తులు తిరిగితే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏవైనా సమస్యలుంటే 100 నంబర్కు డయల్ చేయాలని సూచించారు. కొవిడ్ వ్యాప్తి నివారణకు మాస్క్ లేకుండా బయట తిరిగితే రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మావోయిస్టు మాజీ సానుభూతిపరులకు ఈ సందర్భంగా ఏసీపీ కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లను పంపి ణీ చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లిరూరల్, వన్టౌన్ , తాండూర్, మందమర్రి సీఐలు జగదీశ్, రాజు,బాబురావు, ప్రమోద్రావు, నెన్నెల ఎస్ఐ రమాకాంత్, సబ్డివిజన్ ఎస్ఐలు సమ్మయ్య, ప్రశాంత్రెడ్డి, నరేశ్, కొమురయ్య, పీఎస్ఐలు రవికుమార్, మహేశ్, 77 మంది పోలీసులున్నారు.