ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం
ఎదులాపురం, డిసెంబర్ 3 : దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు దివ్యాంగులకు అనేక సంక్షేమ పథకాలు అందించామన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. అనంతరం ఐసీడీఎస్ పీడీ మిల్కా మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే దివ్యాంగులకు అన్ని శాఖల్లో ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్లో అర్హతను బట్టి అవకాశాలు కల్పించామన్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 15వ తేదీ నుంచి శిక్షణ కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం ఉపాధి హామీ పనుల్లో అత్యధికంగా పనిచేసిన దివ్యాంగులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో కిషన్, ఏపీడీ రవీందర్ రాథోడ్, ఎంపీడీవోలు, ఏపీవోలు, దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు, బధిరుల సంఘం నాయకులు విద్యార్థులు, పాల్గొన్నారు.
దివ్యాంగుల సంక్షేమానికి కృషి : నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్కుమార్
నిర్మల్ చైన్గేట్, డిసెంబర్ 3 : దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ సీహెచ్ ప్రవీణ్కుమార్ అన్నారు. జిల్లా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో స్థానిక టీఎన్జీవో భవనంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. డీడబ్ల్యూవో బీ స్రవంతి, డీఆర్డీవో విజయలక్ష్మి, అదనపు డీఆర్డీవో గోవిందరావు, టీడీఆర్డీవో సట్టి సాయన్న, ఎన్పీఆర్డీ ప్రవీణ్కుమార్, స్పందన ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఇసాక్అలీ, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, సక్షమ్ జిల్లా అధ్యక్షుడు మహేశ్, చెవిటి, మూగ జిల్లా అధ్యక్షుడు సాయినాథ్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఐసీడీఎస్, ఐసీపీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.