కుభీర్, డిసెంబర్ 3 : ‘జయ జయ పాండు రంగ విఠలా.., విఠల విఠల పాండురంగా..’ నామస్మరణతో కుభీర్ మండలకేంద్రం పులకించింది. కోలాటం, భజనలు, నృత్యాలు, డప్పు వాయిద్యా ల నడుమ విఠల-రుక్మిణి ఉత్సవ విగ్రహాల శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్భంగా జాతర జనసంద్రమైంది. గత నెల 26న యాదవ, మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యం లో ప్రారంభమైన తాళ సప్తమి వేడుకలు శుక్రవా రం భారీ అన్నదాన కార్యక్రమంతో ముగిశాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. సూర్యోదయానికి ముందే ఆలయంలో కాగడ హారతి నిర్వహించారు. ముందుగా గణపతి, విఠల-రుక్మిణి ఆలయాల్లో పూజారులు రాజు, ప్రమోద్ మహారాజు అభిషేకం చేసి, నూతన పట్టువస్ర్తాలను సమర్పించారు. అనంతరం భక్తులు అన్న ప్రసాదం స్వీకరించేందుకు క్యూలైన్ కట్టారు. కుభీర్, భైంసా పోలీసులు బందోబస్తును నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు పవార్ రామారావు పటేల్, ఆలయ కమిటీ చైర్మ న్ నారా పర్శురాం, సర్పంచ్ పానాజీ మీరా, విజయ్కుమార్, ఎంపీటీసీ పోసాని, మున్నూరుకాపు సంఘం తాలుకా అధ్యక్షుడు రోళ్ల రమేశ్, ఎంపీపీ తూం రాజేశ్వర్, వైస్ ఎంపీపీ మోహియొద్దీన్, జడ్పీటీసీ అల్కాతాయి, మా జీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, ఏఎంసీ చైర్మన్ కందూర్ సంతోష్, మాజీ ఎంపీపీ విఠల్, యాదవ, ము న్నూరుకాపు సంఘాల అధ్యక్షులు కందూరి చి న్న సాయినాథ్, వడ్నం దత్తాత్రి, జిల్లా ఎస్సీ కా ర్పొరేషన్ ఈడీ హన్మాండ్లు, ఎంపీడీవో రమేశ్, ఎంపీవో గోవర్ధన్, సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ గంగారాం, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.