కాసిపేట, అక్టోబర్ 3 : బెల్లంపల్లిలో ఇచ్చినట్లుగా సింగరేణి ప్రాంతమైన సోమగూడెంలోనూ ఏళ్ల తరబడి సింగరేణి స్థలాల్లో నివాసముంటున్న వారికి పట్టాలు ఇప్పిస్తామని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హామీ ఇచ్చారు. ఆదివారం సోమగూడెం భరత్ కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొరకొప్పుల ప్రమీలాగౌడ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. సోమగూడెం సింగరేణి ప్రాంతంలో కొన్నేండ్లుగా ఇళ్లు కట్టుకొని ఉంటున్న వారందరికీ పట్టాలు ఇప్పించాలని సర్పంచ్ ఎమ్మెల్యేకు విజ్ఙప్తి చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. పట్టాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. సింగరేణి ప్రాంతంతో పాటు షాపింగ్ కాంప్లెక్స్ ఏరియాలో ఉంటున్న వారికీ పట్టాలు ఇప్పించాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే.. మందమర్రి సింగరేణి జీఎంతో ఫోన్లో మాట్లాడారు. సింగరేణి కాలనీలో సమస్యలున్నాయని, వెంటనే పరిష్కరించాలని, ఇళ్ల పట్టాలపై కాలనీల్లో పర్యటించి పరిశీలించి పరిష్కరించుదామని చెప్పారు. సోమగూడెం సింగరేణి కాలనీలోని శిశు మందిర్ క్రీడా మైదానంలో లైట్ల ఏర్పాటు, సమస్యలను పరిష్కంచాలని సూచించారు.షాపింగ్ కాంప్లెక్స్ స్థలాల సమస్యను తహసీల్దార్తో మాట్లాడగా.. పరిష్కరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రమీలాగౌడ్, టీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు రంగు రవితేజ గౌడ్, పట్టణ అధ్యక్షుడు బైరగోని సిద్ధయ్య, చీమల శైలజ, దుర్గం లక్ష్మి, జాడి ప్రమీల, దుర్గం గోపాల్, కుక్క రాంచందర్, మాడ గోపాల్, జాడి శివ, జిల్లాల రాజేందర్, వొడ్నాల సత్యనారాయణ, అంకూస్, చీమల శ్రీనివాస్, శంకర్ గౌడ్, మద్దెల రాణా తదితరులు పాల్గొన్నారు.