ఆదిలాబాద్ రూరల్/బేల, డిసెంబర్ 1 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో బుధవారం ఫ్రెషర్స్ డే, సెకండియర్ డీఎడ్ విద్యార్థులకు ఫేర్వెల్ డే వేడుకలు అంబరాన్నంటాయి. విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. కళాశాల నుంచి వెళ్లిపోతున్న విద్యార్థులు తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ముఖ్యఅతిథిగా ఆదిలాబాద్ డీఈవో ప్రణిత పాల్గొని, మాట్లాడారు. భావితరాలకు పౌరులను తయారుచేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డైట్ కళాశాల ప్రిన్సిపాల్, నిర్మల్ డీఈవో రవీందర్రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్, అధ్యాపకులు కిషన్రెడ్డి, సంతో ష్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బేల మండలంలోని కీర్తన డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీనియర్ విద్యార్థులు కొత్తగా వచ్చిన వారికి స్వాగతం పలికారు. ముఖ్య అతిథులుగా బేల సర్పంచ్ వట్టిపెల్లి ఇంద్రశేఖర్, ఎస్ఐ కల్యాణ్, కళాశాల చైర్మన్ పవన్కుమార్ అగర్వాల్, విద్యావేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు. కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ వరప్రసాద్ రావు, విద్యావేత్తలు కన్నం మోహన్ బాబు, ఆవుల రజనీకాంత్, ప్రమోద్ రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.