రామకృష్ణాపూర్, అక్టోబర్ 1 : సింగరేణి ఉత్పత్తి లక్ష్యసాధనకు యంత్రాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని డైరెక్టర్ (ఫైనాన్స్, పీ అండ్ పీ, పా)ఎన్ బలరాం అన్నారు. మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఉపరితల గనిలో కొమట్స్ హెచ్డీ-465, 60 టన్నుల సామ ర్థ్యం గల ఐదు డంపర్లను శుక్రవారం ఏరియా జీఎం చింత ల శ్రీనివాస్తో కలిసి డైరెక్టర్ ఫైనాన్స్ (పీఅండ్పీ,పా) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ చొరవతో ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన 5 డంపర్లను కొనుగోలు చేశామన్నారు. ఒక్కొక్క డంపర్ రూ. 2 కోట్ల 7లక్షల 50వేలతో కొనుగోలు చేసి రామకృష్ణాపూర్ ఓసీపీకి అందించినట్లు తెలిపారు. ఒక్కొక్కదాని సామర్థ్యం 60 టన్నులు అని, వీటిని సక్రమంగా ఉపయోగించుకొని రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించి సంస్థ పురోగభివృద్ధికి మ నమందరం కలిసికట్టుగా పని చేద్దామన్నారు. ఆర్కేపీ ఓసీపీ ప్రాజెక్ట్ ప్రాంగణంలోని దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో జీఎం చింతల శ్రీనివాస్తో కలిసి జమ్మి మొక్కలను నాటా రు. కార్యక్రమంలో జీఎంఈఅండ్ఎం (ఓసీపీఎస్)గోపాలకృష్ణమూర్తి, జీఎం (ఎస్వోటు డైరెక్టర్ పీ అండ్ పీ) డీ రవిప్రసాద్, ఏజీఎం(ఈఅండ్ఎం) జగన్మోహన్రావు, గుర్తిం పు సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి అక్బర్అలీ, సీఎంవోఏఐ అధ్యక్షుడు జక్కారెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ మధుసూదన్, పీఎం వరప్రసాద్, మేనేజర్ వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్ ఇంజినీర్ మ హేందర్, యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.