జైపూర్, అక్టోబర్ 1: ప్రతి ఒక్కరూ వ్యకిగత పరిశుభ్రత పాటించాలని ఎస్టీపీపీ ముఖ్య సాంకేతిక సలహాదారు సంజయ్కుమార్ ష్యూర్ సూచించారు. స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎస్టీపీపీలో అధికారులు, కార్మికులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ నెల 1 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పరిశుభ్రతకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీఎం బస్విరెడ్డి, ఏజీఎం మురళీధర్, డీజీఎం రవికుమార్, అధికారుల సంఘం నాయకులు సముద్రాల వేణుగోపాల్, గుర్తింపు సంఘం నాయకులు చుక్కల శ్రీనివాస్, పర్సనల్ అధికారి నారాయణరావు, పీఎం శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
జైపూర్ మండలంలో..
జైపూర్ మండలకేంద్రంలోగల రైతు వేదిక వద్ద శుక్రవారం ఎంపీడీవో కే నాగేశ్వర్రెడ్డి జైపూర్, భీమారం మండలాల్లో పంచాయతీ సెక్రటరీలకు సచ్ఛతా పక్వాడా కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా గ్రామాలను శుభ్రం ఉంచేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సతీశ్కుమార్, భీమారం మండలం ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో శ్రీపతి బాపు, కార్యక్రమ కో ఆర్డినేటర్లు మల్లేశ్, రాజేందర్తో రెండు మండలాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
సింగరేణి ఏరియా దవాఖానలో..
బెల్లంపల్లిటౌన్, అక్టోబర్ 1 : పట్టణంలోని సింగరేణి ఏరియా దవాఖానలో శుక్రవారం స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ రామల శౌరి, ఐసొలేషన్ వార్డు ఇన్చార్జి అనిల్రావు, వైద్యుడు మురళీమోహన్, పిట్ కార్యదర్శి అనుముల సత్యనారాయణ, ప్రచార కార్యదర్శి చెవిటి సుదర్శన్, నాయకులు దాసరి శ్రీధర్, స్వరూప, మ్యాట్రిన్లు విజయలక్ష్మి, అరుణ, సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీరాంపూర్ ఏరియా గనులు, ఓసీపీపై..
శ్రీరాంపూర్, అక్టోబర్ 1: శ్రీరాంపూర్ గనులు, ఓసీపీపై శుక్రవారం మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల్లో భాగం గా స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీరాంపూర్ ఓసీపీపై ప్రాజెక్టు ఆఫీసర్ పురుషోత్తంరెడ్డి కార్మికులతో స్వచ్ఛతా పక్వాడా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని కోరారు. పరిసరాలను శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కార్మికులు రక్షణ సూత్రాలను పాటించాలన్నారు. ఈ కార్యరకమంలో మేనేజర్ జనార్దన్, టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు అన్నయ్య, పిట్ కార్యదర్శి పెంట శ్రీనివాస్, సేఫ్టీ ఆఫీసర్ రమేశ్, ఈఈ శ్యాంసుందర్రావు, సీనియర్ పీవో బొంగోని శంకర్ పాల్గొన్నారు.
ఆర్కే 7పై….
శ్రీరాంపూర్ ఆర్కే 7గనిపై శుక్రవారం మేనేజర్ సబ్బని లక్షణ్ స్వచ్ఛతా పక్వాడాపై ప్రతిజ్ఞ చేయించారు. ఆరోగ్యవంతమైన భారత్ ఆవిష్కరించాలన్న మహాత్ముడి కలలు నిజం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ ఆఫీసర్ లింగమూర్తి, డిప్యూటీ మేనేజర్ రాందాస్, రవిశంకర్, వెంటిలేషన్ ఆఫీసర్ జగదీశ్, సీనియర్ పీవో సంతన్, పిట్ కార్యదర్శి వెంకటి పాల్గొన్నారు.