ఇంద్రవెల్లి, జనవరి 1 : మండల కేంద్రంలోని అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్, భీం ఆర్మీ దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో శనివారం భీమా కోరేగావ్ విజయ్ దివస్ను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌక్లో దళితులు, దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం భీమా కోరేగావ్లో 1818 జనవరి 1న జరిగిన యుద్ధంలో విరమరణం పొందిన అమరులైన మహార్ సైనికుల అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. దళితుల ఆధ్వర్యంలో బుద్ధ, ధమ్మ, సంఘ వందన తీసుకున్నారు. అంబేద్కర్ జీవిత చరిత్ర, అమరులైన మహార్ సైనికులపై కళాకారులు వివిధ పాటలు పాడారు. కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్కేళే శివాజీ, దళిత సంఘాల నాయకులు సూర్యవంశీ ఉత్తమ్, లహుదాస్ సావంత్, ఉత్తమ్ కాంబ్లే, సత్యానంద్, కాంబ్లే బాపురావ్, బాబాసాహెబ్, కామ్రాజ్, పరత్వాగ్ దత్తా, వికాస్, దళితానంద్, తదితరులు పాల్గొన్నారు.
మహర్ బెటాలియన్ ఆధ్వర్యంలో
ఆదిలాబాద్ టౌన్, జనవరి 1 : పట్టణంలో మహర్ బెటాలియన్ ఆధ్వర్యంలో శౌర్య దినోత్సవం నిర్వహించారు. అంబేద్కర్ చౌక్లో బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాల నివాళులర్పించారు. భుక్తాపూర్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శైలేందర్ వాఘ్మారే , రత్నాజాడే ప్రజ్ఞకుమార్, ఉదయ్కుమార్, రాహుల్, సురేశ్, దినేశ్, హరీశ్, అశోక్, సాయి, రాజ్కుమార్, ఉద్దవ్, సయిన్, సంతోష్, అశోక్, ఉన్నారు.
నార్నూర్లో..
నార్నూర్, జనవరి 1 : మండల కేంద్రంలోని త్రిరత్న బుద్ధ విహార్లో కోరేగావ్ బెటాలియన్, అంబేద్కర్ యూత్ అసోసియేషన్ నాయకుల ఆధ్వర్యంలో భీమా కోరేగావ్ దివస్ను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోరేగావ్ దివస్ ఘనత గురించి పలువురు నాయకులు కొనియాడారు. అనంతరం ఐటీడీఏ డైరెక్టర్ మడావి మాన్కును శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్ దుర్గే కాంతారావ్, దుర్గే గుణవంత్రావ్, చంద్రశేఖర్, కొరల మహేందర్, సునీల్, దుర్గే మహేందర్, శాంతారావ్, రుక్మాబాయి, కేశవ్ పాల్గొన్నారు.