నేరస్తులపై నిఘా పెంచాలి
అన్ని జిల్లాల ఎస్పీలతో వీసీలో డీజీపీ మహేందర్ రెడ్డి
ఎదులాపురం, నవంబర్ 30 : వర్టికల్స్ పద్ధతిలో అందించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి గుర్తింపు పొందాలని పోలీసు అధికారులకు డీజీపీ డాక్టర్ ఎం మహేందర్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల ఎస్పీలతో మంగళవారం ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. జిల్లాలో గతంలో నేరాలు చేసిన, అలవాటుగా నేరాలు చేస్తున్న వారిపై నిఘా పెట్టడంతో పాటు కేసులు నమోదు చేయాలన్నారు. గంజాయి, పొగాకు ఉత్పత్తులతో పాటు మత్తు పదార్థాల రవాణాకు పాల్పడే వారి కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు. మత్తు పదార్థాల కట్టడికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. నేరస్తులకు కోర్టు ద్వారా శిక్షపడేందుకు నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేసి, సాక్ష్యాదారాలు సేకరించాలని సూచించారు. అనంతరం ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ.. పోలీసుల అవసరాల కోసం అర్జీలను ఆన్లైన్ హెచ్ఆర్ఎంఎస్ పద్ధతిలో సమర్పించుకునేలా రూపాంతరం చేసినట్లు తెలిపారు. రానున్న లోక్ అదాలత్లో అత్యధిక కేసుల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాస్రా వు, కార్యాలయ పరిపాలన అధికారి మహ్మద్ యూనుస్ అలీ, గ్రామీణ సీఐ కే పురుషోత్తంచా రి, డీసీఆర్బీ ఎస్ఐ ఎంఏ హకీం, ఏఎస్ఐ జాదవ్ సుభాష్, కమ్యూనికేషన్ ఎస్ఐ గణేశ్, కంప్యూటర్ విభాగం ఇన్చార్జి ఎస్ సంజీవ్కుమార్, శేఖర్, రియాజ్, కిషోర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.