హాజీపూర్, సెప్టెంబర్ 30 : మత్స్యకారులకు ఉపాధి, వారి ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని జిల్లా మత్స్యశాఖ అధికారి సత్యనారాయణ అన్నారు. మండలంలోని దొనబండలోని ఊర చెరువులో 33 వేల చేప పిల్లలను గురువారం వదిలారు. అనంతరం కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అబ్దుల్ హై, ఎంపీవో కందుకూరి రవిబాబు, సర్పంచ్ జాడి సత్యం, బుద్ధిపల్లి సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి జాదవ్ మాధవ్ తదితరులున్నారు.
భీమిని మండలంలో..
కన్నెపల్లి, సెప్టెంబరు 30 : భీమిని మండలంలోని రాంపూర్, లక్ష్మీపూర్, పెద్దగుడిపేట, కేస్లాపూర్లోనిచెరువుల్లో ఎంపీపీ పోతురాజుల రాజేశ్వరి చేప పిల్లలను వదిలారు. చేప పిల్లల పెంపకంతో మత్స్యకారులకు ఉపాధి, గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందన్నారు. జడ్పీటీసీ పోతురాజుల గంగ క్క, సర్పంచ్ గడ్డం ఎల్లాగౌడ్, ఎంపీటీసీ సంతోష్, చెరువుల చైర్మన్ పులబోయిన శ్రీశైలం, కార్యదర్శి పులి వేణు, మత్య్సశాఖ అధికారులున్నారు.