ప్రజావాణిలో వచ్చే సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్లోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు.
నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి
ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి అర్జీల స్వీకరణ
మొత్తంగా 42 దరఖాస్తులు వచ్చినట్లు అధికారుల వెల్లడి
ఎదులాపురం, మే 15 : ప్రజావాణిలో వచ్చే సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్లోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. వివిధ ప్రాంతాల ప్రజల సమస్యలపై అర్జీలను అదనపు కలెక్టర్ నటరాజ్తో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ శాఖల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, భూ సంబంధిత, పింఛన్, స్వయం ఉపాధి, వైద్యం, తదితర సమస్యలపై అర్జీలు అందజేశారు. ఈ ప్రజావాణిలో ఆర్డీవో రాథోడ్ రమేశ్, మున్సిపల్ కమిషనర్ శైలజ, జడ్పీ సీఈవో గణపతి, డీఆర్డీవో కిషన్, డీపీవో శ్రీనివాస్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
అర్జీలను పరిష్కరించాలి
aనిర్మల్ టౌన్, మే 15 : ప్రతి సోమవారం ప్రజల నుంచి వచ్చే అర్జీలను సంబంధిత శాఖల అధికారులు సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ వరుణ్రెడ్డి ఆదేశించారు. సోమవారం నిర్మల్లోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వారు చెప్పే సమస్యలను విని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 42 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
ఉట్నూర్, మార్చి 15 : గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఐటీడీఏ ఏపీవో కనక భీంరావ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని ఐటీడీఏ సమావేశ మందిరంలో గిరిజన దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని అర్జీలు సమర్పించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, పింఛన్లు, ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు సమర్పించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏజెన్సీ వైద్యాధికారి బాలు ఏస్డీవో కిష్టయ్య, ఏపీవో పీటీజీ ఆత్రం భాస్కర్, ఏవో రాంబాబు, నాగభూషణం, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మనోహర్, ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.