నిర్మల్ టౌన్, నవంబర్ 26 : రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లో ఆదరణ పొందడంతోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై కక్షసాధింపు ధోరణికి పాల్పడుతూ ఆర్థిక చేయూతలో మొండి చేయి చూపిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో శనివారం దిలావర్పూర్, నిర్మల్ రూరల్ మండలంలోని 114 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎనిమిదేండ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ఒకవైపు బీజేపీ నేతలు మెచ్చుకుంటూనే తమ రాజకీయ ఉనికి కోసం రాష్ర్టానికి వచ్చి విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇలాంటి పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేసే దమ్ము బీజేపీకి ఉందా? అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజ లు కేసీఆర్ వెంటే ఉండేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, నిర్మల్ ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు సుభాష్రావు, తహసీల్దార్లు కరీం, ప్రభాకర్, టీఆర్ఎస్ నాయకులు చిలుక గోవర్ధన్రెడ్డి, బోండ్ల గంగాధర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
రూ. 10వేల కోట్లు పంపిణీ చేశాం
సోన్, నవంబర్ 26 : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద రాష్ట్రంలో రూ.10వేల కోట్లను పంపిణీ చేశామని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సోన్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద 42 మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఆడపిల్లల పెళ్లిలు చేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులకు బాసటగా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. ఒక్క రూపాయి సహాయం చేయలేని బీజేపీ నేతలు గల్లీలోకి వచ్చి తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ప్రజలే వారికి బుద్ధి చెబుతారన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జీవన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజి రాజేందర్, సర్పంచ్ టీ వినోద్, తహసీల్దార్ హిమబిందు, ఎంపీటీసీ దాసరి లింగవ్వ-శ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్ బర్మదాసు, ఆయా గ్రామాల నాయకులు వెంకాయిగారి శ్రీనివాస్రెడ్డి, సుంచు శ్రీనివాస్, బర్మ లక్ష్మీరాజ నర్సయ్య, బండి లింగన్న, ఎల్చల్ గంగారెడ్డి, మహేందర్రెడ్డి, అంపోలి మురళీధర్రెడ్డి, ప్రదీప్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
బాధితులకు పరామర్శ
సోన్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబసభ్యులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన జక్క రాజేశ్వర్ తండ్రి రాములు ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన రంజిత్, రవి సైతం ఇటీవల మృతి చెందగా, విష యం తెలుసుకున్న మంత్రి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూ తి తెలిపారు. మంత్రి వెంట జడ్పీటీసీ జీవన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్రెడ్డి, సర్పంచ్ టీ వినోద్, మాజీ వైస్ ఎంపీపీ మురళీధర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులున్నారు.