ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్నికల హడావుడి మొదలు కాగా, ఎలక్షన్ కమిషన్ ఓటు హక్కు నమోదుకు మరో అవకాశం కల్పించింది. ఈ నెల 19వ తేదీ వరకు గడువు ఇవ్వగా, 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నది. మరోవైపు ఓటరు జాబితాలో తప్పులను సవరించేందుకు కూడా వెసులుబాటు కల్పించగా, బీఎల్వోలు ఇంటింటా తిరుగుతూ ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఎన్నికల హడావుడి మొదలు కాగా, ఎలక్షన్ కమిషన్ ఓటు హక్కు నమోదుకు మరో అవకాశం కల్పించింది. 18 ఏళ్లు నిండిన వారికి ఈ నెల 19వ తేదీ వరకు ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఇందుకోసం అధికారులు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే ఓటరు జాబితాలో తప్పులను కూడా సవరించేందుకు వెసులుబాటు కల్పించారు. మృతి చెందిన వారి పేర్లు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారి వివరాలను తొలగిస్తూ కొత్త ఓటర్ల జాబితాను రూపొందిస్తున్నారు. బీఎల్వోలు ఇంటింటికీ తిరుగుతూ జాబితాను సవరణ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓటు లేదని, గల్లంతైందని, ఓటు వేసే బూత్ మారిపోయిందని ఇబ్బందులు పడే బదులు ఈసీ కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చే సుకోవడం మంచిదని కలెక్టర్, అధికారులు చెబుతున్నారు. త మ పేరుగాని, తమ కుంటుంబ సభ్యుల పేర్లుగాని సరిగా ఉన్నా యా..? ఏ బూత్లో ఓటు వేయాలి.. అనే విషయాలను ఒకసారి చెక్చేసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు. పేర్లు, చి రునామాల్లో తప్పులుంటే కూడా సరిచేసుకోవాలని చెబుతున్నారు.
ఫారం 6 ద్వారా కొత్తగా ఓటు హక్కు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే వారు దీనిని నింపి సంబంధిత అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఫారం 7 ద్వారా ఓటు తొలగించుకోవచ్చు. మృతి చెందిన, శాశ్వతంగా వలన వెళ్లి ఇతర ప్రాంతాల్లో స్థిపరడిన వారు, వివాహమై వెళ్లిన వారు దీనిని నింపి మార్పు చేసుకోవచ్చు. ఫారం 8 ద్వారా సవరణకు అవకాశం ఉటుంది. ఫొటో, పేర్లు, చిరునామాలు తదితర మార్పులు చేసుకునేందుకు ఈ ఫారం ఉపయోగపడుతుంది. ఫారం 8ఏ ద్వారా నియోజకవర్గం పరిధిలోని ఒక బూత్ నుంచి మరో బూత్లోకి ఓటు మార్పునకు ఉపయోగపడుతుంది.
18 ఏళ్లునిండిన వారు, జాబితాల్లో మార్పులు, చేర్పులు కోరుకుంటున్న వారు సమీపంలోని బీఎల్వోలను సంప్రదించవచ్చు. కొత్త ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. బీఎల్వోల వద్ద అన్ని రకాల ఫారాలు అందుబాటులో ఉంటాయి. ఇదేగాకుండా కలెక్టర్, ఆర్డీవో, తహసిల్దార్, మున్సిపాలిటీ కా ర్యాలయాల్లో కూడా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అలా గే ఆన్లైన్ ద్వారా కూడా ఓటరుగా పేరు నమోదు, సవరణలు చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం www. ceotelanga na.nic.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు.