ఊరూరా కొనుగోళ్ల జాతర..రికార్డుస్థాయిలో దిగుబడి..
రైతన్నలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్
భూగర్భ జలాలు పెరగడంతో దిగుబడి అధికం
గతేడాదితో పోల్చితే 85,413 మెట్రిక్ టన్నులు అధికం
ఈ యేడాది 1.37 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు
ఖాతాల్లోకి వెంట వెంటనే డబ్బులు..
ఇంటిల్లిపాదితో పండుగ చేసుకుంటున్న రైతన్నలు..
మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 14 : మంచిర్యాల జిల్లావ్యాప్తంగా వానకాలం ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. ఐకేపీ(డీఆర్డీఏ), పీఏసీఎస్, డీసీఎంఎస్ల ఆధ్వర్యంలో 243 కేంద్రాలు కేం ద్రాలు ఏర్పాటు చేసి.. 25,293 మంది రైతుల నుంచి 1,37,179.840 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో బెల్లంపల్లి మండలం నుంచి 213 మంది రైతుల వద్ద 1,079.120 మె ట్రిక్ టన్నులు, భీమారంలో 859 మంది నుంచి 5,037.280, భీమినిలో 108 మంది వద్ద 482. 280, చెన్నూర్లో 4,543 మంది వద్ద 24,39 6.720, దండేపల్లిలో 3,834 మంది వద్ద 22,42 9.040, హాజీపూర్లో 2,065 రైతుల వద్ద 10,8 91.560, జైపూర్లో 2,701 రైతుల వద్ద 16, 754.560, జన్నారంలో 4,529 మంది వద్ద 18, 851.960, కన్నెపల్లిలో 578 మంది వద్ద 3,15 5.560, కాసిపేటలో 74 మంది వద్ద 201.200, కోటపల్లిలో 1,401 రైతుల వద్ద 6,624.720, లక్షెట్టిపేటలో 2,838 మంది వద్ద 19,570. 880, మందమర్రిలో 70 మంది వద్ద 283.160, నెన్నెలలో 620 మంది వద్ద 2,881.480, తాం డూరులో 84 రైతుల వద్ద 391.480, వేమనపల్లి లో 776 మంది రైతుల వద్ద నుంచి 4,148.840 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
గతేడాదితో పోల్చితే 85,413 మెట్రిక్ టన్నులు అధికం..
మంచిర్యాల జిల్లావ్యాప్తంగా 1,12,980 ఎకరాల్లో వరి సాగైంది. రైతుల శ్రేయస్సు దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం నిరాటంకంగా విద్యుత్ అందించడం, నీటికి కొదవ లేకపోవడం, సమృద్ధిగా వర్షాలు కురియడం వల్ల దిగుబడి పెరిగింది. గతేడాది వానకాలంలో 11,957 మంది రైతుల నుంచి 51,765.920 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా.. ఈ ఏడాది 25,293 మంది నుంచి 1,37,179.840 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఈ లెక్కన 85,413.920 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి క్వింటాలుకు గ్రేడ్-ఏ రకానికి రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 చొప్పున రూ. 266.69 కోట్లు రైతులకు మద్దతు రూపంలో తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది.
చివరి గింజా కొనుగోలు చేశాం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లాలోఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్ ఏజెన్సీల ద్వారా ధాన్యం కొనుగోలు చేశాం. గతేడాదితో పోల్చితో అధికంగా ధాన్యం వచ్చింది. ఎంత వచ్చినా కొనుగోలు చేయాలని ప్రణాళికాబద్ధంగా.. రైతులకు ఇబ్బంది కలుగకుండా గన్నీ బ్యాగులు, వాహన సదుపాయాలు కల్పించాం. కలెక్టర్ భారతీ హోళికేరి, అడిషనల్ కలెక్టర్ మధూసూదన్ నాయక్ సహకారంతో మార్కెటింగ్, ట్రాన్స్పోర్ట్, పోలీసులతో కలిసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేశాం.