నేరడిగొండ, మే 20 : పేదల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో శనివారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం లో అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పెద్దపీ ట వేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకు లు అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, వైస్ ఎంపీపీ మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ శివారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ దావుల భోజన్న, తహసీల్దార్ పవన్చంద్ర, తదితరులు పాల్గొన్నారు.
పేదింటి ఆడ బిడ్డలకు సీఎం కేసీఆర్ భరోసా
తాంసి, మే 20 : పేదింటి ఆడబిడ్డలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టారని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని పొన్నారి గ్రామంలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. నిరుపేదలకు కల్యాణ లక్ష్మి వరంలా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ సురకుంటి మంజుల-శ్రీధర్ రెడ్డి, జడ్పీటీసీ తాటిపల్లి రాజు, వైస్ ఎంపీపీ ముచ్చ రేఖ-రఘు, సర్పంచ్ సదానందం, ఉప సర్పంచ్ అశోక్, వెంకన్న, నాయకులు లింగారెడ్డి, అరుణ్కుమార్, భోజన్న యాదవ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సమక్షంలో చేరికలు
బోథ్, మే 20: మండలంలోని సొనాల గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన మహేశ్వర్, సత్యనారాయణ, అరుణ్, జైకిషన్ తదితరులకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమై పార్టీ లో చేరుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో పార్టీ అధికార ప్రతినిధి కిరణ్కుమార్, మండల కన్వీనర్ డీ నారాయణరెడ్డి, ఏఎంసీ చైర్మన్ రుక్మణ్సింగ్, స ర్పంచ్ సురేందర్యాదవ్, అమృత్రావు, లోలపు పోశె ట్టి, మునేశ్వర్ సోమన్న, పంద్రం శంకర్ పాల్గొన్నారు.
నిధులు మంజూరు చేయాలి
బోథ్లో నాయీ బ్రాహ్మణ సంఘ భవనానికి నిధు లు మంజూరు చేయాలని కోరుతూ సంఘ సభ్యులు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్కు వినతి పత్రం అందజేశారు. ఆదిలాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో భవన నిర్మాణానికి రూ.2 లక్షలు మంజూరు చేస్తామన్నారు. మరో రూ.3 లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురేందర్యాదవ్, సంఘం అధ్యక్షుడు అవునూరి నవీన్, లింగంపెల్లి మునీశ్, సంతోష్, దామోదర్, ఎల్ మోహన్, రాజేశ్ పాల్గొన్నారు.