నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
సినిమా హాళ్లు, పెట్రోల్ బంక్ యజమానులతో సమావేశం
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 20 : నిర్మల్ జిల్లాలోని సినిమా హాళ్లు, పెట్రోల్ బంక్లలో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం సినిమా హాళ్లు, పెట్రోల్ బంక్ యజమానులతో కొవిడ్ నిబంధనలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమా హాళ్లు, పెట్రోల్ బంక్లలో కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. కొవిడ్ నియంత్రణకు నో టికెట్, నో మాస్క్, నో పెట్రోల్ నిబంధనను అమలు చేయాలని సూచించారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా సిబ్బంది నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా పని చేయాలని పేర్కొన్నారు. అర్హులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, ఎలాంటి అనుమానాలున్నా తప్పక కొవిడ్ చికిత్సలు చేయించుకోవాలన్నారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, కొవిడ్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, సినిమాహాళ్లు, పెట్రోల్ బంక్ల యజమానులు పాల్గొన్నారు.
అప్రమత్తతతో కరోనాను జయించవచ్చు..
మామడ, ఏప్రిల్ 20 : అప్రమత్తతతో కరోనాను జయించవచ్చని కలెక్టర్ ము షారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. మామడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పొన్కల్లో ప్రత్యేక వ్యాక్సినేషన్ శిబిరాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ హే మంత్ బోర్కడేతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రజలు వ్యాక్సినేషన్పై అపోహలు నమ్మవద్దన్నారు. 45 ఏండ్లు పైబడిన వారు టీకా తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. మే 1వ తేదీ నుంచి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరినీ టీకా ఇస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో రమేశ్, పీహెచ్సీ వైద్యురాలు మహీత, తదితరులు ఉన్నారు.