భైంసా, డిసెంబర్ 18 : ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి చెందుతన్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ఆదివారం ప్రారంభించారు. ముందుగా మన్మథ్, గడ్చాంద, లోకేశ్వరం, పాఠశాలలో మన ఊరు-మన బడి ప్రణాళిక కింద పాఠశాలల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసి పేద మధ్య తరగతి వారికి ఉన్నత విద్యనందించాలని కోరారు.
లోకేశ్వరం ఐకేపీ కార్యాలయం ఎదుట తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (డీఆర్డీఏ) ద్వారా ప్రగతి మండల సమాఖ్య ఏర్పాటు చేసిన వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రాన్ని ముథోల్ఎమ్మెల్యే జీ విఠల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ అద్దె కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, ఎంపీపీ లలితా భోజన్న, సొసైటీ చైర్మన్ సిరిపురం రత్నాకర్ రావు, బీఆర్ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, యూత్ మండల అధ్యక్షుడు కపిల్, సోషల్ మీడియా అధ్యక్షుడు బండి ప్రశాంత్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజేశ్ బాబు, మెండే శ్రీధర్, కుంటాల సాగర్, సుధాకర్, ఐకేపీ ఏపీఎం మల్లేశ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఐకేపీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. భైంసాలో సంతోషిమాత మందిర నిర్మాణానికి రూ. 10 లక్షల కేటాయించి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటికే భైంసా పట్టణంలో ఎన్నో ఆలయాల అభివృద్ధికి కృషి చేశామని చెప్పారు. రానున్న రోజుల్లో సైతం మరిన్ని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ కృష,్ణ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మురళీ గౌడ్, తోట రాము, సూర్యనారాయణ, గంగాధర్, రమేశ్, నందు భయ్యా, మోహన్, కౌన్సిలర్లు చందులాల్, తోట విజయ్, పాపేశ్, ఉన్నారు.
కుభీర్, డిసెంబర్ 18: రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించడం ఖాయమని బీఆర్ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి జోస్యం చెప్పారు. కుభీర్లో డోడర్న (2) తండాకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 60 మంది మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్ ఆధ్వర్యంలో ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలోని ప్రతి పల్లె అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. కేసీఆర్ నిబద్ధత కలిగిన గొప్ప నాయకుడు, దార్శనికుడని అభివర్ణించారు. ఇతర పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని, మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని చెప్పారు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తల కృషి ఎంతో ఉందని, వారి రుణం తీర్చుకోలేనిదన్నారు. పనిచేసే కార్యకర్తలందరికీ సముచిత న్యాయం దక్కుతుందని తెలిపారు. జాంగాం సర్పంచ్ ముజాహిద్ఖాన్, ఎంపీటీసీ పంతుల హన్మాండ్లు, ఏఎంసీ చైర్మన్ కందూర్ సంతోష్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, సంజయ్ చౌహాన్, నాయకులు పానాజీ విజయ్కుమార్, ఉప సర్పంచ్ ఇక్రముద్దీన్, నాయకులు బొప్ప నాగలింగం, సూది రాజన్న, గోనే కల్యాణ్, మాజీ సర్పంచ్ గోరేకర్ బాబు, దొంతుల సాయన్న, సాహెబ్ రావు, అమ్దు పటేల్ పాల్గొన్నారు.