మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
రహదారి పనుల పరిశీలన
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 14 : ఆదిలాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రభాగాన నిలబెడతామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని కౌలాస్నగర్లో రూ.2 కోట్లతో చేపట్టనున్న రహదారి ప్రాంతాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. పట్టణంలోని జగ్జీవన్రామ్ చౌరస్తా నుంచి ఇండోర్ స్టేడియం వరకు రోడ్డును వెడల్పు చేసి డ్రైన్లు నిర్మించడంతో పాటు వివిధ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు అహ్లాదం పంచేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. కేఆర్కేకు వెళ్లే రహదారిని రూ.కోటితో డబుల్లేన్ రోడ్లుగా మార్చి, డ్రైనేజీల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పట్టణాభివృద్ధికి సుమారు రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఆదిలాబాద్ ప్రజల చిరకాల కోరిక రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి రూ.100 కోట్లతో త్వరలో పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
మావల, బట్టిసావర్గం నుంచి విలీనమైనకాలనీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. బీజేపీ ఎంపీ సోయం బాపురావ్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి మరో రూ.100 కోట్లు తీసుకొస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు. బీజేపీ నాయకులు అనవసర ఆరోపణలు మాని పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. సర్వే నం.2/3లో డీటీపీసీ లేఅవుట్ కోసం 2011లో దరఖాస్తు చేసుకున్నారని, నేటి వరకు అనుమతి రాలేదన్నారు. ఈ భూమిలో 15శాతం మున్సిపల్కు మార్టిగేజ్, 10 శాతం గిఫ్ట్డీడ్ కింద అందించాల్సి ఉన్నా నేటి వరకు అందించలేదని పేర్కొన్నారు. ఇక్కడ ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగడంలేదని, బీజేపీ నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని, ప్రతిపక్షాల ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు బండారి సతీశ్, జాదవ్ పవన్ నాయక్ పాల్గొన్నారు.
పేదలను ఆదుకోవడానికే సీఎంఆర్ఎఫ్..
పేదలు అత్యవసర సమయంలో ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకొని అప్పులు పాలు కాకుండా సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు అందిస్తున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిర్పెల్లికి చెందిన సాధుల్లాకు రూ.30 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆయన పంపిణీ చేశారు. వేలాది మందికి సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.