ములుగు : నేడు ములుగు జిల్లాలో రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తాడ్వాయి మండలం మేడారం గ్రామానికి చేరుకొని అభివృద్ధి పనులను ప్రారంభించిన తర్వాత 2024 మేడారం మహా జాతరపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.